Nagachaitanya -Sobhita: సినీ నటి శోభిత నాగ చైతన్యల వివాహం త్వరలోనే జరగబోతున్న సంగతి తెలిసిందే .డిసెంబర్ 4వ తేదీ వీరి వివాహం ఎంతో ఘనంగా జరగబోతుంది. అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. ఇక తాజాగా నాగచైతన్య శోభిత హల్ది వేడుకలు కూడా ఎంత ఘనంగా జరిగాయని తెలుస్తుంది. ఈ హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక శోభిత నాగచైతన్య గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారని వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియజేయడంతో పెద్దలు కూడా వీరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాగచైతన్య శోభిత కుటుంబం గురించి ఎంతో గొప్పగా చెప్పారు కుటుంబ ఆలోచనలు మా కుటుంబ ఆలోచనలు చాలు దగ్గరగా ఉన్నాయని వారి కుటుంబంతో కలిసి ప్రయాణించడం నాకు చాలా సౌకర్యంగా ఉందని తెలిపారు.
ఇక శోభిత కుటుంబ సభ్యులు నన్ను ఒక కొడుకు లాగా భావిస్తున్నారు అంటు నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక శోభిత కుటుంబ సభ్యులు కూడా పెళ్లి విషయంలో ఒకే విషయం మమ్మల్ని కోరారు అంటూ నాగార్జున తెలిపారు. వీరి వివాహాన్ని సాంప్రదాయపద్ధంగా నిర్వహించాలని చెప్పినట్లు ఇటీవల నాగార్జున ఓ సందర్భంలో తెలిపారు. బ్రాహ్మణ కుటుంబం కావడంతో బ్రాహ్మణ కుటుంబ సాంప్రదాయంలోని వీరి పెళ్లి జరగబోతుంది.
ఇదిలా ఉండగా నాగచైతన్య శోభిత పెళ్లి వేడుకలలో భాగంగా పెళ్లికి వచ్చిన అతిథిలకు ఇచ్చే రిటన్ గిఫ్ట్స్ ఎంతో అద్భుతంగా భిన్నంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. సుమారు 300 మంది వరకు ఈ పెళ్లికి హాజరు కావచ్చు అని అంచనాలు ఉన్నాయి. అయితే వచ్చిన వారందరికీ కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా పట్టు పంచ పట్టుచీరను రిటన్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…