Nagababu: మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పొలిటికల్ కామెంట్స్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావనకు తీసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అభిమానులు అందరూ గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు దీంతో నాగబాబు ఇంకా గట్టిగా అరవండి ఈ అరుపులు వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి అంటూ ఈయన కామెంట్లు చేశారు.
తాను ఇప్పుడే పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఇక్కడికి వస్తున్నానని తెలిపారు. ఇలా నాగబాబు మాట్లాడుతూ ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం వారి అరుపులు మానలేదు దీంతో నాగబాబు మాట్లాడుతూ ఈ ఎనర్జీ మొత్తం మీరు ఓట్లు వేయడంలో కూడా చూపించండి అంటూ ఈయన చేసినటువంటి పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ ఎనర్జీ ఓట్లు వేయడంలో ఉండాలి..
ఇకపోతే నాగబాబు ఈసారి జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. జనసేన టిడిపి కూటమి కలసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయి. అయితే జనసేనకు 24 ఎమ్మెల్యే సీట్లతో పాటు మూడు ఎంపీ సీట్లను కేటాయించారని తెలుస్తోంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…