Netizens are in awe of Samyuktha Menon's sanskar!
గచ్చిబౌలి హైటెక్ సిటీలోని ఫీనిక్స్ ఈక్వినాక్స్లో బుధవారం (ఆగస్ట్ 06) మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఘనంగా నిర్వహించారు. చుక్కపల్లి శంకర్ రావు స్మారకంగా, అలాగే 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘హనుమాన్’ హీరో తేజ సజ్జాతో పాటు పలు సినీ ప్రముఖులు కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి రక్తదానం అవసరం గురించి మాట్లాడి, తాను బ్లడ్ బ్యాంక్ ప్రారంభించడానికి గల కారణాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జ్యోతి ప్రజ్వలనతో బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించే సమయంలో చిరంజీవి తన షూలను విప్పి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పక్కకు వెళ్లి షూలు వేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కాస్త ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు ఆయనకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంయుక్త మేనన్ కూడా మెగాస్టార్ షూ తొడగడానికి ప్రయత్నించింది. అయితే చిరంజీవి మాత్రం సౌమ్యంగా నిరాకరించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంయుక్త మేనన్ చూపిన గౌరవానికి, ఆమె సంస్కారం పట్ల నెటిజన్లు మరియు సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు.
సంయుక్త మేనన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తరువాత ‘బింబిసార’తో సూపర్ హిట్ అందుకుంది. ‘విరూపాక్ష’తో వంద కోట్ల క్లబ్లోకి చేరింది. ‘సార్’ సినిమాతో కూడా విజయాన్ని సాధించిన ఈ మలయాళ బ్యూటీ, ప్రస్తుతం తెలుగులో లక్కీ హీరోయిన్గా పేరుపొందింది.
ప్రస్తుతం సంయుక్త పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’లో హీరోయిన్గా నటిస్తోంది. అదేవిధంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న చిత్రంలోనూ కథానాయికగా ఎంపికైంది. ఇక బాలకృష్ణ ‘అఖండ 2’ లోనూ సంయుక్త మేనన్ కీలక పాత్ర పోషిస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…