ఉదయం లేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్, భారంగా ఉండటం… ఇవి చాలా మందికి సర్వసాధారణ సమస్యలే. అయితే చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. కొందరు వెంటనే యాంటాసిడ్ మాత్రలు వేసుకుంటే సరిపోతుందని భావిస్తారు. కానీ జీవనశైలిలో చిన్న మార్పులు, ఇంట్లో దొరికే సహజ పదార్థాలతోనే ఈ సమస్యకు చిటికెలో ఉపశమనం పొందొచ్చు.
గ్యాస్ సమస్య ఎక్కువగా జీర్ణక్రియ మందగించడం, అజీర్తి, అసమయ భోజనం, ఎక్కువగా టీ–కాఫీ తాగడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల వస్తుంది. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని సరైన అలవాట్లు పాటిస్తే రోజంతా తేలికగా అనిపిస్తుంది.
ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగడం మంచి అలవాటు. ఇది జీర్ణవ్యవస్థను మేల్కొలిపేలా పనిచేస్తుంది. ఇందులో సగం నిమ్మకాయ రసం పిండి తాగితే శరీరంలో నిల్వైన వ్యర్థాలు బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది. ఆమ్లత తగ్గడంలో కూడా ఇది ఉపయుక్తం. రోజూ ఇలా చేస్తే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
అల్లం సహజ జీర్ణోపకారి. ఇందులో ఉండే జింజెరాల్ అనే పదార్థం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. చిన్న ముక్క అల్లం నోట్లో వేసుకుని నమలవచ్చు. లేకపోతే నీటిలో అల్లం ముక్కలు వేసి మరిగించి టీలా తాగితే కడుపు కండరాలు సడలిపోతాయి. గ్యాస్తో వచ్చే అసౌకర్యం తగ్గుతుంది.
గ్యాస్ సమస్యకు పాతకాలం నుంచి ఉపయోగిస్తున్న సులభమైన మార్గం వాము. ఇందులో ఉండే థైమోల్ జీర్ణరసాలను ఉత్తేజపరుస్తుంది. అర టీస్పూన్ వాము, చిటికెడు నల్ల ఉప్పు గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే కడుపు నొప్పి, ఉబ్బరం తగ్గుతాయి. భోజనం తర్వాత కూడా ఇది తీసుకోవచ్చు.
జీలకర్ర జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఒక చెంచా జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం అదే నీటిని మరిగించి వడకట్టాలి. టీలా వేడిగా తాగితే కడుపు తేలికగా ఉంటుంది. గ్యాస్ సమస్యతో పాటు అజీర్తి తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుంది.
కడుపు ఉబ్బరం, గ్యాస్ వల్ల నొప్పి ఉంటే ఇంగువ మంచి సహాయకారి. గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలిపి తాగాలి. లేకపోతే కొద్దిగా నీటితో ఇంగువ పేస్ట్ చేసి నాభి చుట్టూ రాయవచ్చు. ఇది గ్యాస్ విడుదలకు దోహదపడుతుంది.
గ్యాస్ సమస్య తరచూ వస్తూ, తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించడం మంచిది. సాధారణంగా జీవనశైలిలో మార్పులు, ఈ చిన్న ఇంటి చిట్కాలు పాటిస్తే ఉదయం కడుపు ఉబ్బరం నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
వేసవి కాలం రాగానే మార్కెట్లలో మామిడి పండ్ల రద్దీ పెరుగుతుంది. అయితే ఈ డిమాండ్ను అవకాశంగా తీసుకుని కొందరు వ్యాపారులు…
కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక ఘటన సమాజాన్ని కలచివేసింది. పసిపాపల నవ్వులతో కళకళలాడాల్సిన ఓ ఇల్లు ఒక్కసారిగా విషాదంలో…
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా భూమి కంపించడం ప్రజల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. కొద్ది సెకన్ల పాటు…
శ్రీకాకుళం జిల్లాలో ఒకేసారి పలువురు అస్వస్థతకు గురవడంతో కలకలం చెలరేగింది. గ్రామీణ మండలం సింగుపురంలో జరిగిన జాతర సందర్భంగా బాదం…
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది…
ప్రకృతి మనకు అందించిన ఔషధ సంపదలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా కనిపించే ఈ మొక్కను…