బిగ్‌బాస్‌ హౌస్ లోకి మాజీ కంటెస్టెంట్లు.. ఇక సందడే సందడి..ఎవరెవరు వెళ్లనున్నారో తెలుసా..!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 5 ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. మరో రెండు రోజుల్లో ఎవరు బిగ్ బాస్ విన్నర్ అనేది తెలియనుంది. ఇక పోతే ఈ రెండు రోజులు కూడా హౌజ్ లో పెద్ద హంగామానే జరగనుంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఫైనల్ కు భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

మాజీ కంటెస్టెంట్లను హౌజ్ లోకి పంపించి సందడి చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్‌లాగే ఈ సారి కూడా సీనియర్లు హౌస్‌లోని ఫైనలిస్టులతో ముచ్చటించనున్నారు. దీనికి సంబంధించి ఎపిసోడ్ నేడు రాబోతోంది. అయితే బయట కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాళ్లు హౌజ్ లోనే ఓ రూంలో ఉండి వాళ్లతో ముచ్చటించనున్నారు.

తెలిసిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 2 రన్నర్ గీతామాధురి, బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ అఖిల్ సార్థక్, రోల్ రైడా మరియు హరితేజలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. వీళ్ల రాకతో బిగ్ బాస్ హౌస్ మొత్తం సందడి సందడిగా మారనుంది. ఎవరి ఆట ఎలా ఉంది..ఎవరికి పంచ్ లు ఇస్తారో.. ఎవరిని పొగడ్తలతో ముంచెత్తుతారో చూడాలి. ఇక పోతే ఫైనల్ ను ఈ సారి బిగ్ బాస్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ రోజు సాంగ్స్ సెట్ పై షూట్ చేశారట. ఫైనల్ రోజు బిగ్ బాస్ టెలికాస్ట్ అనేది సాయంత్రం 6.00 లేదా 6.30 సమయాల్లో ఉండనుంది. ఇక ఓటింగ్ ప్రకారం చూసుకుంటే.. సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర మధ్య టైటిల్ పోరు ఉండనుందనేది తెలుస్తోంది. నిన్నటి వరకు శ్రీరామ చంద్ర ఓటింగ్ లో మూడో స్థానంలో ఉండగా.. ఒక్కసారిగా రెండో స్థానంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాదు..సన్నీ ఫ్యాన్స్ కూడా రిలాక్స్ అయ్యారని.. షణ్ముఖ్ కు కూడా ఓట్లు బాగానే వస్తున్నాయనేది టాక్. ఏదేమైనా ఎక్కవ శాతం ఈ సారి టైటిల్ సన్నీ గెలుస్తాడనేది చాలామంది నమ్ముతున్నారు.