టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైంది. సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచానాలు నెలకొన్నాయి. కాగా ఈసినిమాను రెండు పార్టులుగా తీసున్న విషయం తెలిసిందే. అయితే బహుబలితో రెండు పార్టులుగా సినిమా తీయడం అనే సంప్రదాయాన్ని రాజమౌళి తీసుకువచ్చారు. ఇప్పుడు సుకుమార్ కూడా రాజమౌళిలాగే పుష్పను రెండు పార్టులుగా తీస్తున్నారు. దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే రాజమౌళి చెప్పినందుకే సుకుమార్ పుష్పను రెండు పార్టులుగా తీస్తున్నారట.
అయితే మొదట పుష్ప సినిమాను ఒకే పార్టులో తీయడం సాధ్యం కాదనే అనుకున్నారట సుకుమార్..దీనికి అనుగుణంగానే రెండు పార్టులుగా తీసేందుకు కథను కూడా చిత్ర యూనిట్ సిద్ధం చేసుకుంది. రెండు పార్టులకు సంబంధించి కథతో మార్పులు కూడా చేశారు. కాగా ఎమైదో తెలియదు కానీ మళ్లీ పుష్ఫను ఒకే పార్ట్ గా తీద్దాం అని అనుకున్నారట సుకుమార్ ఈవిషయాన్ని బన్నికి, మైత్రి మూవీ మేకర్స్ కు తెలియజేశారు.
ఈ విషమం అటు తిరిగి.. ఇటు తిరిగి జక్కన్న చెవిలో పడిందట. వెంటనే రాజమౌళి.. సుకుమార్ కు ఫోన్ చేసి.. సినిమాను ఒకే పార్టులో తీద్దాం అనుకుంటున్నారట నిజమేనా..? అని అడిగారు. దీనికి సుకుమార్ అవును రెండు పార్టులు ఎందుకు అని అనిపించిందని అన్నారట.. రాజమౌళి మాత్రం రెండు పార్టులుగా సినిమాను తీయండి. అందుకు కథలో మార్పులు చేయండని సలహా కూడా ఇచ్చారట.
దీంతో సుకుమార్ పుష్ప మూవీని రెండు పార్టులుగా మలిచారు. ప్రస్తుతం మనం మొదటి పార్టును చూశాం. అయితే కథ సాగదీసినట్లు ఉండటం… బలమైన సన్నివేశాలు పడకపోవడంతో.. మూవీని ఒకే పార్టులో తీస్తే బాగుండనే విషయాన్ని ప్రస్తుతం అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారట. ఒకే పార్టులో తీస్తే కథనం మరింత బాగుండనే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…