2015 సంవత్సరంలో మొదటి సారిగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శృతి హాసన్ నటించిన శ్రీమంతుడు రూపుదిద్ధుకుంది. 70 కోట్ల రూపాయల పెట్టుబడి కలిగిన ఈ చిత్రం అగస్టు 7, 2015న ప్రపంచవ్యాప్తంగా 2500 తెరలపై విడుదలైనది. దీని నిర్మాణంలోనే రూపుదిద్దుకున్న మరో సినిమా జనతా గ్యారేజ్. ఇది 2016 సంవత్సరంలో విడుదలైది.
తర్వాతి సినిమా సుకుమార్ దర్శకత్వంలో రాం చరణ్ , సమంత, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన రంగస్థలం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 30, 2018 న విడుదలైంది. తర్వాత సాయిధరమ్ తేజ్ చిత్రం సుప్రీమ్. ఈ సినిమా కూడా వసూళ్లలో ముందు వరుసలో ఉంది. ఇక వైష్ణవ్ తేజ్ తో కూడా ఇదే సంస్థ నిర్మించిన మరో చిత్రం ఉప్పెన.
ఎంత పెద్ద సంచలనం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఎక్కువ శాతం మెగా హీరోలకు మైత్రీ మూవీ మేకర్స్ కి మంచి అనుబంధం ఉంది. ఇక తాజాగా ఇదే బ్యానర్ పై విడుదలైన చిత్రం పుష్ప. ఈ చిత్రం కూడా ఈ బ్యానర్ పై హిట్ టాక్ ను తెచ్చుకుంది. మెగా కాంపౌండ్ లో ఇలా హ్యాట్రిక్ విజయాలు చూసిన మైత్రీ సంస్థ.. పుష్ప - ద రైజ్తోనూ ఆ పరంపరను సాగించింది.
ఈ రోజు వరకు పుష్ప పాజిటివ్ టాక్ తోనే కొనసాగుతోంది. అంతే కాకుండా ఇదే బ్యానర్ పై త్వరలో మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలా మెగా ఫ్యామిలీకి.. మైత్రీ బ్యానర్ కు ఉన్న అనుబంధం.. విజయవంతంగా కొనసాగుతుందనే చెప్పాలి. ఇంకా రాబోయే సినిమాలు కూడా ఈ బ్యానర్ లో ఎలాంటి సంచలనాలు సాధిస్తాయో చూడాలి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…