Featured

ఏపీ మహిళలకు మరో శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలోని మహిళల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం జగన్ రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్త చెప్పారు. జగన్ సర్కార్ రాష్ట్రంలోని మహిళలకు వైఎస్సార్ చేయూత స్కీమ్ ద్వారా ఇప్పటికే ప్రయోజనం కల్పిస్తుండగా ప్రభుత్వం చేయూత స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన మహిళలకు పాడి పశువులు కొనుగోలు చేసి పంపిణీ చేయాలని భావిస్తోంది.

ఇప్పటికే పశువులు ఉన్న మహిళల నుంచి పాలను అమూల్ ద్వారా కొనుగోలు చేసి, మంచి ధర ఇచ్చి ప్రయోజనం చేకూరేలా చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు వైఎస్సార్ చేయూత స్కీమ్ ద్వారా 18,750 రూపాయలు బ్యాంకు ఖాతాలలో జమ చేసిన సంగతి తెలిసిందే. ఈ నగదుతో ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనుకున్నా, పాడి పశువుల ద్వారా స్థిరపడాలన్నా ప్రభుత్వం తమ వంతు సహాయం చేస్తోంది.

వైఎస్సార్ చేయూత స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన మహిళల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా 4.90 లక్షల మంది మహిళలు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందడానికి దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లలో కొందరు ఇప్పటికే పాడి పశువులు ఉన్నవాళ్లు కాగా మరికొందరు కొత్తగా పాడి పశువుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మొత్తం 5.63 లక్షల పాడి పశువులను కొనుగోలు చేస్తోంది.

జగన్ సర్కార్ రాష్ట్రంలో పాల సేకరణ కేంద్రాలను, బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ కోసం జగన్ సర్కార్ 11 లక్షల రూపాయలు ఖర్చు చేయనుండగా పాల సేకరణ కేంద్రం కోసం 4 లక్షల రూపాయలు ఖర్చు చేయనుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

6 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

7 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

8 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

8 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

9 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

9 hours ago