Prabhas: డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వంలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. ఈ సినిమా అశ్వినీ దత్ స్వప్న సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ ఫ్రీ రిలీజ్ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రభాస్ రావడం మరింత ప్లస్ అయిందని చెప్పాలి.ఇక వేదికపై ప్రభాస్ మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్ ఇదివరకే చూసాను ఎంతో అద్భుతంగా ఉంది ఈ ట్రైలర్ ఎవరు కట్ చేశారో తెలియదు కానీ చాలా బాగుంది అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ఇక మహానటి సినిమాలో దుల్కర్ నటన చూసి ఫిదా అయ్యానని తాను కూడా ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరు అంటూ ప్రభాస్ హీరో పై ప్రశంసలు కురిపించారు. అలాగే ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల గురించి అశ్విని దత్ గురించి ప్రభాస్ చెబుతూ వారిపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాల్సి ఉంటుంది అలాంటి వాటిలో సీతారామం ఒకటి అని చెప్పారు.
ఈ సినిమాని కాశ్మీర్ రష్యా వంటి ప్రదేశాలలో చిత్రీకరించారు. ఎంతో అద్భుతమైన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లోనే చూడాలని ప్రభాస్ అభిమానులకు పిలుపునిచ్చారు. ఇకపోతే మా సినిమా ఇండస్ట్రీకి థియేటర్ గుడి లాంటిది. ఆ గుడిని మీరు మాకిచ్చారు. మన ఇంట్లో పూజగది ఉంది కదా అని గుడికి వెళ్లడం మానేయం అలాగే ప్రతి ఒక్కరు కూడా గుడి లాంటి థియేటర్ కి వచ్చి సినిమాని చూడాలని ఈయన అభిమానులను కోరారు. ఇలా ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…