Prabhas: మాకు థియేటర్లు గుడితో సమానం… ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా.. ప్రభాస్ కామెంట్స్ వైరల్?

Prabhas: డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వంలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. ఈ సినిమా అశ్వినీ దత్ స్వప్న సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ ఫ్రీ రిలీజ్ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రభాస్ రావడం మరింత ప్లస్ అయిందని చెప్పాలి.ఇక వేదికపై ప్రభాస్ మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్ ఇదివరకే చూసాను ఎంతో అద్భుతంగా ఉంది ఈ ట్రైలర్ ఎవరు కట్ చేశారో తెలియదు కానీ చాలా బాగుంది అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఇక మహానటి సినిమాలో దుల్కర్ నటన చూసి ఫిదా అయ్యానని తాను కూడా ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరు అంటూ ప్రభాస్ హీరో పై ప్రశంసలు కురిపించారు. అలాగే ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల గురించి అశ్విని దత్ గురించి ప్రభాస్ చెబుతూ వారిపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాల్సి ఉంటుంది అలాంటి వాటిలో సీతారామం ఒకటి అని చెప్పారు.

Prabhas: ఆ గుడిని మీరే మాకు ఇచ్చారు…

ఈ సినిమాని కాశ్మీర్ రష్యా వంటి ప్రదేశాలలో చిత్రీకరించారు. ఎంతో అద్భుతమైన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లోనే చూడాలని ప్రభాస్ అభిమానులకు పిలుపునిచ్చారు. ఇకపోతే మా సినిమా ఇండస్ట్రీకి థియేటర్ గుడి లాంటిది. ఆ గుడిని మీరు మాకిచ్చారు. మన ఇంట్లో పూజగది ఉంది కదా అని గుడికి వెళ్లడం మానేయం అలాగే ప్రతి ఒక్కరు కూడా గుడి లాంటి థియేటర్ కి వచ్చి సినిమాని చూడాలని ఈయన అభిమానులను కోరారు. ఇలా ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.