రావు గోపాలరావు వారసుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రావు రమేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటు విలన్ పాత్ర అయినా.. అటు తండ్రి పాత్ర అయినా అద్భుతంగా పండిస్తారు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు చాల మందే ఉన్న పాత్రకు సరిపడ ఆర్టిస్ట్ లు మాత్రం చాల తక్కువ..అలాంటి తక్కువ మందిలో బాగా పాపులర్ అయిన ఆర్టిస్ట్ రావు రమేష్ .
ప్రస్తుతం రావు రమేష్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అయితే తాజాగా ఈయన నిర్మాతలను షాక్ ఇస్తున్నాడనే వార్తలు బయటకు వచ్చాయి. ఇంతకీ ఏంటంటారా.. అతడి పారితోషకం గురించి. ఇటీవల మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన నాయట్టు సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. వీటి హక్కులను గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుంది.
అయితే ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏకకాలంలో రూపొందించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం రావు రమేష్ ను సంప్రదించారు. అయితే ఈ క్యారెక్టర్ చేయడానికి అతడు ఏకంగా రూ.1.5 కోట్లు రెమ్యూనరేషన్ అడిగాడంట. అయితే ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కాని.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంత రెమ్యూనరేషన్ అడగడానికి గల కారణం అందులో రావు రమేష్ పాత్ర కీలకమైంది.
అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని కూడా నిర్మాత అల్లు అరవింద్ అతడు అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్.ఇప్పటి వరకు ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు ఇంతలా రెమ్యునరేషన్ తీసుకోనుండడం ఇదే తొలిసారి అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మలయాళంలో సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి మరి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…