పండుగ సీజన్ రాబోతున్నందును ఎస్బీఐ తన కస్టమర్లకు అద్భుత ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఫిక్స్డ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాలతో పాటు వాహనాలకు సంబంధించిన లోన్లు, బంగారు రుణాలు, గృహ రుణాలు తదితర రుణాలపై కూడా ఆఫర్లు ప్రకటించింది. దీనిలో ముఖ్యంగా కారు లోన్ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్ రుసుము మినహాయింపుతో పాటు వాహనం ఆన్-రోడ్ ధరలో 90 శాతం వరకు రుణం పొందే సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
దీనిని కేవలం యోనో యాప్ ద్వారా కారు లోన్ కు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తించనుది. దీనిపై వడ్డీని 0.25 శాతం రాయితీ లభించనుంది. సాధారణంగా యోనో వినియోగదారులకు కార్లోన్పై వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఇక గోల్డ్ లోన్ రుణాలపై వడ్డీని 0.75 శాతం రాయితీని అందిస్తున్నట్లు ప్రకటించింది ఎస్బీఐ. అయితే దీనిలో కూడా యోనో యాప్ ద్వారా గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు ప్రాసెసింగ్ రుసుము పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.
గోల్డ్ లోన్ పై ప్రస్తుతం ఆన్ లైన్, ఆఫ్ లైన్ ల ద్వారా వడ్డీ రేటు 7.5 శాతం ఉంది. ఇక పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. మనం దరఖాస్తును ఎలా సమర్పించినా ప్రాసెసింగ్ ఫీజును మాత్రం 100 శాతం మినహాయింపు ఉంటుందని ప్రకటించారు. వీటిలో కరోనా కాలంలో ముందు ఉండి ప్రజల రక్షణ కొరకు పోరాడిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వీటిపై 0.5 శాతం ప్రత్యేక రాయితీని కల్పించారు. వారికి ఇంకా కార్ లోన్, గోల్డ్ లోన్పైనా ఈ ఆఫర్ త్వరలో వర్తించనున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది.
ఇక హోమ్ లోన్ పై కూడా 100 శాతం ప్రెసెసింగ్ ఫీజు రాయితీ ని ఈ నెల 31 వరకు ప్రకటించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా రిటైల్ డిపాజిట్దారుల కోసం ‘ప్లాటినమ్ టర్మ్ డిపాజిట్’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా, 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలపరిమితి డిపాజిట్పై 0.15 శాతం అదనపు వడ్డీ ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఈనెల 15 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ టర్మ్ డిపాజిట్ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్లు ఎస్ బీఐ ప్రకటించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…