Rayalaseema: మహి వి రాఘవ పరిచయం అవసరం లేని పేరు.విలేజ్లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ, పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర, సిద్ధా లోకం ఎలా ఉంది, యాత్ర 2 సినిమాలను,అలాగే సేవ్ ది టైగర్స్,సైతాన్ వంటి వెబ్ సిరీస్ లో ద్వారా దర్శకుడిగా, నిర్మాతగా గుర్తింపు పొందిన ఈయన ఇటీవల యాత్ర2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
ఇటీవల ఈయన ఈ సినిమా చేసిన తర్వాత తనకు మదన పల్లెలో రెండు ఎకరాల స్థలం కావాలని ప్రభుత్వాన్ని కోరింది అయితే ఇదే విషయాన్ని ఓవర్గానికి చెందిన మీడియా వారు తప్పుగా ప్రచారం చేశారు. యాత్ర సినిమా చేశారు కనకే ఏపీ ప్రభుత్వం ఆయనకు రెండు ఎకరాల స్థలం ఇచ్చింది అంటూ తప్పుడు ప్రచారం చేశారు.
ఇలా తనకు ప్రభుత్వం రెండు ఎకరాలు స్థలం ఇచ్చింది అంటూ వచ్చిన వార్తలపై తాజాగా డైరెక్టర్ మహి వి రాఘవ్ స్పందించారు. తాను తన స్వప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని భూమి అడగలేదని తెలిపారు. ఇప్పటివరకు ఇండస్ట్రీ రాయలసీమకు ఎలాంటి సేవ చేయలేదు అలాంటిది రాయలసీమలో ఒక మినీ స్టూడియో ఉంటే ఆ పరిసర ప్రాంతాలలో షూటింగులు జరుపుకునే వారికి ప్రాథమిక సదుపాయాలు ఉంటాయన్న ఉద్దేశంతోనే తాను ప్రభుత్వానికి పొలం రెండు ఎకరాలు కావాలని వేడుకున్నానని తెలిపారు..
మినీ స్టూడియో కోసం..
అయితే ఈ విషయాన్ని ఓవర్గానికి చెందినవారు తప్పుగా ప్రచారం చేశారు. అయితే అదే వర్గానికి చెందిన వారికి కొన్ని వందల ఎకరాలు భూములను ప్రభుత్వం ఇచ్చింది నేను ఇలా వందల ఎకరాలు అడగలేదు కేవలం రెండు ఎకరాలు మాత్రమే అడిగాను. మా ప్రాంతంలో మినీ స్టూడియో ఉంటే షూటింగులు చేయడానికి వచ్చిన వారికి సదుపాయాలు ఉండటమే కాకుండా సమీప ప్రాంతాలలో ఉన్నవారికి ఉపాధి కల్పించినట్టు అవుతుందన్న ఒక ఉద్దేశంతోనే రెండు ఎకరాల పొలం అడిగాను అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…