Upasana: పనిలేని వాళ్లే పిల్లల్ని కంటారు.. సద్గురు మాటలకు షాక్ అయిన ఉపాసన?

Upasana: మెగా కోడలు ఉపాసన గురించి అందరికీ సుపరిచితమే. ఈమె పది సంవత్సరాల క్రితం మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పిల్లల కోసం ఎంతో మంది మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇకపోతే పిల్లల గురించి ఉపాసనను ఎప్పుడు ప్రశ్నించిన ఆమె ఆ ప్రశ్నలు దాటవేస్తూ సమయం వచ్చినప్పుడే సమాధానం చెబుతా అంటున్నారు.

sadhgurus-about-childrens-and-upasana-get-shocked-about-sadhgurus-words

ఇకపోతే తాజాగా ఉపాసన సద్గురును కలిసి పిల్లల గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు.చాలామంది పిల్లల గురించి నన్ను ప్రశ్నిస్తున్నారు.నన్నే అలా ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటూ ఈమె సద్గురు ముందు తన సందేహాలను బయటపెట్టింది. నా పెళ్లి జరిగి 10 సంవత్సరాలవుతుంది 10 సంవత్సరాల నుంచి నేను నా జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాను. అయినా ఇలా అందరూ నన్ను పిల్లల గురించి ప్రశ్నలు వేస్తున్నారని ఉపాసన వెల్లడించారు.

sadhgurus-about-childrens-and-upasana-get-shocked-about-sadhgurus-words

ఉపాసన మాటలకు సద్గురు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.ఎవరైతే పిల్లల్ని కనకుండా ఉంటారో అలాంటి వారికి తాను ఒక బహుమతి ఇస్తానని ఈ జనరేషన్లో పిల్లల్ని కనాల్సిన అవసరం లేదని సద్గురు సమాధానం చెప్పారు. ఒకవేళ నువ్వు ఆడపులి అయితే పులి పిల్లనే కను ఈ భూమిపై పులి పిల్లలు అంతరించిపోతున్నాయి. అయితే ఈ భూమిపై మానవజాతి భూమ్మీద లెక్కకు మించి ఉంది.

పనిపై దృష్టి పెడితే అలాంటి ఆలోచనలు రావు…

పని చేయాలనే ఆలోచన పనిపై మనం దృష్టి పెడితే పిల్లల్ని కనాలి పెంచాలి అనే ఆలోచనలు కూడా రావు. ఎవరికైతే పనీపాట లేకుండా ఉంటారో అలాంటి వారిలో ఇలాంటి ఎక్కువ హార్మోర్లో ఉంటాయని పని పాట లేని వారే పిల్లల్ని కంటారు అంటూ సద్గురు షాకింగ్ సమాధానం చెప్పారు. ఈ సమాధానం విన్న ఉపాసన ఒక్కసారిగా షాక్ అవుతూ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే మా అత్తమామల నుంచి మీకు ఫోన్ వస్తుందని నవ్వుతూ సమాధానం చెప్పగా..నాకు ఎంతోమంది అత్తమ్మ వాళ్ళ నుంచి ఇలాంటి ఫోన్లు వచ్చాయని సద్గురు సమాధానం చెప్పారు.