Movie News

Sai Dharam Tej: తన ప్రాణాలు కాపాడిన వ్యక్తికి సాయి ధరమ్ తేజ్ చేసిన సాయం ఏమిటో తెలుసా..?

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న సాయి ధరమ్ తేజ్ రెండు సంవత్సరాల క్రితం బైక్ యాక్సిడెంట్ వల్ల తీవ్రంగా గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ చాలా కాలం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత అనారోగ్యం నుండి కోలుకొని మామూలు మనిషిలా ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇక ప్రస్తుతం మళ్లీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21వ తేదీన విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సాయి ధరమ్ తేజ్ సినిమా గురించి,తన ప్రమాదం గురించి ఆసక్తికర విషయాలు అభిమన్యులతో పంచుకుంటున్నాడు.

ఈ క్రమంలో ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నుండి తనని కాపాడిన వ్యక్తికి తాను చేసిన సహాయం గురించి వెల్లడించాడు..ఈ క్రమంలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ..సరైన సమయంలో అతను నన్ను కాపాడకపోతే నేను ఈ రోజు మీ ముందు ఉండేవాడిని కాదు. మానవత్వంతో అతను నాకు చేసిన సహాయానికి నేను డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోలేను.

Sai Dharam Tej: తనకోసం ఎంత దూరమైనా వెళ్తా…

అందుకే అతన్ని కలిసి నా నంబర్ ఇచ్చి.. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా సంకోచించకుండా ఫోన్ చేయమని చెప్పాను .నా ఫ్యామిలీ మెంబర్స్ డబ్బు పరంగా అతడికి ఏమైనా సాయం చేశారో లేదో నాకు తెలియదు. కానీ అతనికి సహాయం చేయటానికి నేను ఎంత దూరమైన వెళ్తాను” అంటూ చెప్పుకొచ్చాడు.ఇక తనకు మద్యం తాగే అలవాటు లేదని ఆ రోజు డైరెక్టర్ దేవకట్ట ఇంటికి తాను వెళుతున్నానని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

6 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

7 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

8 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

8 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

9 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

9 hours ago