మంత్రి కేటీఆర్ పై సమంత క్రేజీ పోస్టు.. సోషల్ మీడియాలో వైరల్..!

నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది. ప్రతీ రోజూ ఏదో ఒక సందేశాత్మక పోస్టులు పెడుతూ తమ అభిమానులకు దగ్గర అవుతోంది. తాజాగా ఆమె తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఆసక్తికరమైన పోస్టు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంతకు ఆమె పోస్టు చేసిన దాంట్లో ఏముందంటే.. ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇటీవల బాల ర‌క్ష‌క్ వాహ‌నాల‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాకొక‌టి చొప్పున 33 బాల ర‌క్ష‌క్ వాహ‌నాల‌ను బుధవారం ప్రారంభించారు. 1098కి డయల్ చేస్తే వెంటనే ఆదుకునేలా ఏర్పాట్లు కూడా చేశారు.

అయితే సత్యవతి నిర్ణయాన్ని కేటీఆర్ ప్రశంసిస్తూ.. తన సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. ఆమె తీసుకున్న నిర్ణయం గొప్పదని.. కేటీఆర్ పోస్టు చేశాడు. అయితే ఇదే పోస్టును సమంత తన ఇన్ స్టా స్టోరీలో పెట్టి.. ఆ పోస్టుకు దండం పెడుతూ.. చప్పట్లు కొడుతన్న ఎమోజీలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇక సమంత ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తియిపోయింది. పుష్ప సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది సమంత. ఈ సాంగ్‌ కోసం సమంత దాదాపు కోటిన్నర పారితోషికాన్ని పుచ్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విడాకుల తర్వాత సమంత స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె చూడని ప్రదేశాలకు కూడా ఈ మధ్యన వెళ్తున్నారు.