యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు బాహుబలి తర్వాత అతడి ఫేట్ మారిపోయింది. ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోయాడు. ఏ సినిమా తీసినా ఇక పాన్ ఇండియా లెవల్లో తీసేస్తున్నాడు. అతడికి ఇచ్చే రెమ్యూనరేషన్ విషయానికి వస్తే బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తగ్గడం లేదనేది టాక్. ఇటీవల ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త అసహనానికి గురవుతన్న మాట వాస్తవమే.
సినిమాకు సంబంధించి ఏమాత్రం అప్ డేట్ రాకపోవడం.. మిగతా హీరోలకు సంబంధించి లుక్స్, పోస్టర్లు, సాంగ్స్ ఇలా ఏదో ఒకటి వస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ చిర్రెత్తిపోతున్నారు. దీనిపై యూవీ క్రియేషన్స్ కూడా ఆలోచించి.. ఇటీవల రాధేశ్యామ్ నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేసింది. అంతే కాకుడా .. ఇంత ఇమేజ్ ను సాధించుకున్న ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశవ్యాప్తంగా బోలెడు మంది అభిమానులను సొంతం చేసుకున్న డార్లింగ్ ప్రభాస్..ప్రజెంట్ వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక అతడి అభిమానుల్లో ఒకరు. తన హెడ్పై ఇంగ్లిష్ అక్షరాలతో ప్రభాస్ అని కనిపించేలా జుట్టు కత్తిరించుకున్నాడు. కాగా సదరు వీరాభిమానాని ఇటీవల ప్రభాస్ ను కలిశాడు.
అతడితో కొంత టైం స్పెండ్ చేసిన ప్రభాస్.. అతడికి ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. వెరీ కాస్ల్టీ వాచ్ను గిఫ్ట్గా ఇచ్చాడు. వాళ్లిద్దరు కలిసి దిగిన ఫొటోలు, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ మంచి మనసు ఆయన ఇచ్చిన గిఫ్ట్ ద్వారా నిరూపితమైందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆ వీరాభిమాని మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.
ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…
ఉదయం పరగడుపున పండ్లు తినాలా లేదా అనే సందేహం చాలా మందిలో కనిపిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ…
ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానాన్ని సంపాదించిన పుణ్యక్షేత్రాల్లో విజయ కీళాద్రి ఆలయాలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. వివిధ జిల్లాల్లో విస్తరించి…
తెలుగు సినీ రంగంలో క్రమశిక్షణ, గంభీరమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచే మంచు మోహన్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్…
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కరుప్పు’పై ఇప్పటికే మంచి అంచనాలు…
వేసవి రాగానే ఇంట్లో ఉండటం చాలా మందికి సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పై అంతస్తుల్లో నివసించే వారికి గదులు భగ్గుమంటూ…