నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది. ప్రతీ రోజూ ఏదో ఒక సందేశాత్మక పోస్టులు పెడుతూ తమ అభిమానులకు దగ్గర అవుతోంది. తాజాగా ఆమె తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఆసక్తికరమైన పోస్టు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకు ఆమె పోస్టు చేసిన దాంట్లో ఏముందంటే.. ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ ఇటీవల బాల రక్షక్ వాహనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాకొకటి చొప్పున 33 బాల రక్షక్ వాహనాలను బుధవారం ప్రారంభించారు. 1098కి డయల్ చేస్తే వెంటనే ఆదుకునేలా ఏర్పాట్లు కూడా చేశారు.
అయితే సత్యవతి నిర్ణయాన్ని కేటీఆర్ ప్రశంసిస్తూ.. తన సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. ఆమె తీసుకున్న నిర్ణయం గొప్పదని.. కేటీఆర్ పోస్టు చేశాడు. అయితే ఇదే పోస్టును సమంత తన ఇన్ స్టా స్టోరీలో పెట్టి.. ఆ పోస్టుకు దండం పెడుతూ.. చప్పట్లు కొడుతన్న ఎమోజీలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక సమంత ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తియిపోయింది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత. ఈ సాంగ్ కోసం సమంత దాదాపు కోటిన్నర పారితోషికాన్ని పుచ్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విడాకుల తర్వాత సమంత స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె చూడని ప్రదేశాలకు కూడా ఈ మధ్యన వెళ్తున్నారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…