అవన్నీ రూమర్సే.. ఇక్కడ నుంచి తాను ఎక్కడకు వెళ్లడం లేదు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..

సమంత, నాగచైతన్య మధ్య గత కొన్ని రోజుల నుంచి విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. రోజుకో వార్తతో హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై నాగచైతన్య లేదా సమంత కూడా ఇంత వరకు ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు. దీంతో ఇంకా ఆ వార్తలకు బలం చేకూరేలా చేస్తున్నాయి.

కొందరైతే సమంత పెళ్లి రోజున భరణం కింద భారీగా తీసుకుంటుందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కోర్టును ఆశ్రయించారని.. దానికి నాగార్జున కూడా అన్ని సిద్ధం చేశారని కొంతకాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ. అంతే కాదు సమంత ముంబాయ్ కి వెళ్లి అక్కడే బాలీవుడ్ సినిమాలు తీస్తూ అక్కడే కొంత కాలం వరకు ఉండబోతోందని కూడా పుకార్లు వచ్చాయి.

అయితే దీనిపై సమంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సమంతకు సంబంధించి దుస్తుల బ్రాండ్ ‘సాకి’ ఏర్పాటుచేసి నిన్నటితో ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ వేడుకను నిర్వహించింది. అలాగే ఆమె సోషల్ మీడియాలోని అభిమానులతో ముచ్చటించారు. ఇలా చేస్తానని ముందుగానే చెప్పిన సామ్.. చెప్పినట్లుగానే అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ముంబైకి మకాం మారుస్తున్నారట కదా, అని ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు అది రూమర్ మాత్రమే, నాకు లైఫ్ ఇచ్చిన హైదరాబాద్ ని వదిలి ఎక్కడికీ వెళ్ళను అన్నారు. హైదరాబాద్ నా హోమ్ టౌన్ అంటూ చెప్పుకొచ్చారు. ఇటువంటివి అన్నీ రూమర్స్ అని కొట్టిపడేశారు. దీంతో ఇలా వస్తున్న వార్తలు అన్నీ రూమర్సే అని.. ఆమె చెప్పకనే చెప్పారు. ఈ పుకార్లు ఇలా ఉంటే.. ఆమె తన సాకీ ఫ్యాషన్ గార్మెంట్స్ బ్రాండ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సాకీ బ్రాండ్ ని ప్రేమించినందుకు.. ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.