Senior actor Chandhra Mohan : ప్రస్తుతం మనం ఉన్నది సోషల్ మీడియా జమానా లో ఏమి జరిగిన చిటికెలో తెలిసిపోతుంది. అయితే మనకు రోజు వచ్చే వార్తలు అన్ని నిజాలు మాత్రం కావు. అందులో ఎన్నో కేవలం గాలి వార్తలు. ఇక సినిమా వాళ్ళ గురించి వచ్చే విషయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా బతికే ఉన్నా వాళ్ళను కాస్త ఈ యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో చంపేస్తున్నారు. ఇక ఆ జంట విడిపోయింది ఈ జంట వీడిపోయిందింటూ వార్తలు. వీటిలో ఎన్నో వార్తలు కేవలం వ్యూస్ కోసం రేటింగ్స్ కోసం చేస్తున్న తప్పుడు ప్రచారాలు. ఇక ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడిన వ్యక్తుల్లో సీనియర్ నటులు చంద్ర మోహన్ కూడా ఒకరు. ఆయన మీద ఆ మధ్య వచ్చిన తప్పుడు వార్తలను గురించి స్పందించారు.
ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే…
కొద్ది రోజుల కిందట చంద్ర మోహన్ గారు తీవ్ర అనారోగ్యం తో ఉన్నారు అన్నట్లుగా వార్తలు రావడం లాంటి విషయాల మీద మాట్లాడుతూ బైపాస్ సర్జరీ చేసి స్టంట్స్ వేశారు అంత బాగుంది కానీ అలా రాసారు మీడియాలో ఈ యూట్యూబ్ వల్ల ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇంకా ఎక్కువయ్యాయి. నాకు చాల సీరియస్ గా ఉంది అంటూ వార్తలు రావడంతో విదేశాల్లో ఉండే నా కూతురు, అల్లుడు బయపడి వచ్చేసారు. డాక్టర్స్ ఆయన కోలుకున్నారు ఆయనను ఇంటికి పంపవచ్చు అని చెప్పినపుడు నా కూతురు, అల్లుడు విషయం చెప్పారు. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాక ఒక స్టేటమెంట్ కూడా ఇవ్వాల్సి వచ్చింది నేను బాగున్నానని అంటూ చెప్పారు.
ఇక ప్రస్తుతం కిడ్నీ సమస్య రావడం వల్ల డైయలసిస్ చేయాలని చెప్పారు. నాకు మొదట్లో నచ్చక వద్దన్నాను కానీ చేయించుకోవాలి లేదంటే కిడ్నీ మార్చాల్సి వస్తుంది మీ వయసు అందుకు తట్టుకోదు అని చెప్పడం తో చేయించుకుంటున్నాను అంటూ చెప్పారు. డయాలసిస్ కు ఒకసారికి రెండూవేల దాకా ఖర్చు అయ్యేది అలా నెలకు అరవై వేలు ఖర్చు అయ్యేది , కొంచెం ఇబ్బంది పడిన మెల్లగా ఇంట్లో వాళ్లే ట్రైన్ అయ్యారు చేయడానికి ఇంట్లోనే మిషన్ పెట్టి చేస్తారు. ఎపుడైనా బయటి నుండి పిలిపించి చేయిస్తున్నారు. సరైన ఆహారం తిని డైట్ ఫాలో అవుతూ ప్రశాంతంగా ఉంటే సమస్య రాదు అంటూ ఆయన ఆరోగ్య పరిస్థితి పై క్లారిటీ ఇచ్చారు.
ఉదయం లేదా రాత్రి సమయంలో టీ తాగడం చాలా మందికి అలవాటే. అయితే సాధారణ టీని అధికంగా తీసుకోవడం వల్ల…
వారానికి ఒకసారి అయినా మటన్ వంటకం ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే మటన్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన…
ఎగతాళిని ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఓ విద్యార్థిని మరోసారి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాచి…
తెలంగాణ రాజకీయాల్లో తాజాగా కొత్త చర్చకు తెరలేపిన అంశం కవిత వ్యాఖ్యలు. కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయంగా మరో దశలోకి…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వరుస ఓటములతో జట్టు…
నేటి కాలంలో రక్తహీనత సమస్య చాలా మందిని వేధిస్తోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. శరీరంలో హీమోగ్లోబిన్…