Featured

Senior Actor Kakarala Sathyanarayana : రామోజీ రావు పని అయిపోయిందని అంటున్నారు… అసలు అలా అనడానికి నువ్వు ఎవరు…: నటుడు కాకరాల సత్యనారాయణ

Senior Actor Kakarala Sathyanarayana : నాటక రంగం నుండి సినిమా రంగానికి వచ్చిన నటులలో కాకరాల ఒకరు. సుమారు రెండుందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయన దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించారు. అలానే కామెడీ, విలనీజం రెండింటిని పండించిన ఆయన బి.ఎన్ రెడ్డి గారి రంగుల రాట్నం సినిమాకు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన మా భూమి వంటి సినిమాల్లో అలాగే చిరంజీవి గారి సినిమాల్లో తొలినాళ్ళలో నటించారు. అలనాటి సినిమా విశేషాలను తాజాగా ఓక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

రామోజీ రావు ను అనడానికి నువ్వు ఎవరు…

పాత తరం నటులు వారి జీవిత విశేషాల గురించి మాట్లాడుతూ కాకరల గారు పలు ఆసక్తికర అంశాలను మాట్లాడారు. కొంతమంది నటులు ప్రతిభ ఉన్న సినిమా రంగంలో ఎక్కువ కాలం మనుగడ సాగించలేక పోడానికి వారు చేసిన స్వీయ అపరధాలే కాకుండా అప్పటి ఇండస్ట్రీ లోని రాజకీయాలు కూడ ఉన్నాయని కానీ వాటిని పైకి మనం చెప్పుకోమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు రామోజీ రావు మోనార్క్ లాగా ఏలాడు . ఆయన సామ్రాజ్యం స్థాపించాడు.

ఇపుడు ఆయన పని అయిపోయింది అన్నట్లుగా చాలా మంది మాట్లాడుతున్నారు. ఆనాడు ఆ మాటతప్పే, ఇపుడు ఈ మాట తప్పే అంటాను అంటూ కాకరాల తెలిపారు. ఆయన టైం బాగున్నపుడు వెలుగు వెలిగాడు ఇపుడు ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. ఒక మహాప్రవాహం వచ్చినపుడు ముందున్న నీరు కొట్టుకుపోవాల్సిందే అలాగే మరో మహా ప్రవాహం వచ్చినపుడు ఈ కెరటం అంతే అది జీవితంలోనూ జరుగుతుంది. వాటిని అంగీకరించి నిశ్శబ్దంగా పక్కకు తప్పుకోవడమే మనం చేయాల్సిన పని అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

10 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

11 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

12 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

13 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

13 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

13 hours ago