Senior Journalist Bhardwaja : వీరసింహా రెడ్డి సినిమా సెట్స్ కి వెళ్లి బాలకృష్ణను కలిసింది పవన్ కళ్యాణ్ అందుకే..!! షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ…!

Senior Journalist Bhardwaja : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ తీవ్రంగా సీఎంతో సహా విమర్శిస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మాత్రమే. తెలుగుదేశం వాళ్ళను పక్కన బెట్టి మరీ పవన్ ను టార్గెట్ చేసారు. చంద్రబాబు కి పవన్ సహకరిస్తున్నారని, పవన్ చేత చంద్రబాబు జనసేనను నడిపిస్తున్నారు అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక తాజాగా వీరసింహా రెడ్డి సెట్స్ లో బాలకృష్ణను పవన్ కళ్యాణ్ కలవడం, ఇక మరోసారి తెలుగుదేశం, జనసేన పొత్తు గురించిన ఊహగానాలకు ఊతం ఇచ్చాయి. ఇక ఈ విషయాల మీద అసలు వారిద్దరూ ఎందుకు కలిశారు అనే అంశం మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.

అందుకే వారిద్దరూ కలిశారు…

తెలుగు దేశం కు జనసేన దగ్గరవుతోంది అనే అనుమానాల నడుమ పవన్ వెళ్లి బాలకృష్ణ ను కలవడం ఆసక్తి రేపుతోంది. ఈ విషయాల మీద మాట్లాడుతూ భరద్వాజ గారు రెండు విషయాలను ప్రస్తావించారు. బాలకృష్ణ హోస్ట్ గా వస్తున్న అన్ స్టాపబుల్ షోకి త్వరలో పవన్ కళ్యాణ్ వస్తాడంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. నిజానికి ఆఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ లేకపోయినా వస్తారనే ఊహగానాల నడుమ ఈ కలయిక జరుగుండొచ్చు. పవన్ షో గురించి బాలకృష్ణతో చర్చించుకోడానికి అయ్యుండొచ్చు. కానీ ఆ షోలో బోల్డ్ గా ప్రశ్నలు అడిగితే వచ్చిన గెస్ట్ సమాధానం చెబుతుంటాడు. ఇలా ముందే వారిద్దరూ బహిరంగగా కలిస్తే ఆ షో క్రెడిబిలిటీ పోతుంది.

పోనీ కలిసిన వారు తాము ఎందుకు కలిశామో చెబితే ఏ గొడవా ఉండదు అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. ఇక మరో కోణం రాజకీయంగా తెలుగుదేశానికి జనసేన దగ్గరవుతోంది అందుకే కలిసి ఉండవచ్చు. బీజేపీ నుండి పవన్ కి ఎలాంటి హామీ వచ్చిందో ఇప్పటికీ స్పష్టత లేకపోయినా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో కలిసి వైసీపీ ని ఓడించాలని ఆలోచిస్తున్నారు పవన్. అందుకే తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ ను కలిసి ఉండవచ్చు అంటూ అభిప్రాయపడ్డారు. అయితే అన్ స్టాపబుల్ కి పవన్ వచ్చినా అందులోనూ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి అంటూ తెలిపారు.