Shaakuntalam Movie: శాకుంతలం సినిమా నన్ను ఎంతో బాధ పెట్టింది… నటి మధుబాల కామెంట్స్ వైరల్!

Shaakuntalam Movie: సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

ఇక ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల అయినప్పటికీ మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై వారం కూడా కాకుండానే పలుచోట్ల సినిమాని తొలగించిన ఘటనలు కూడా ఉన్నాయి. సమంత కెరియర్ లోనే ఈ సినిమా డిజాస్టర్ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాలో పలువురు సీనియర్ సెలబ్రిటీలు కూడా నటించారు. ఇందులో మేనక పాత్రలో నటి మధుబాల నటించారు.

తాజాగా నటి మధుబాల శాకుంతలం సినిమా ఫలితం పై స్పందించారు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సినిమా గురించి ఈమె మాట్లాడుతూ ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేశాము. మాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల నుంచి విడుదల అయ్యే వరకు దర్శకనిర్మాతలు చాలా కష్టపడ్డారు.

Shaakuntalam Movie: కష్టపడిన ఫలితం లేదు…

ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ అందించాలని ప్రయత్నాలు చేశారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయకపోవడం తనను చాలా బాధ కలిగించింది అంటూ ఈ సందర్భంగా మధుబాల ఈ సినిమా అందుకున్న ఫలితం పై స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.