Saidharam Tej: మెగా హీరో సాయి ధరంతేజ్ గత రెండు సంవత్సరాలు క్రితం కేబుల్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన ప్రమాదానికి గురైన సమయంలో అటుగా వెళుతున్నటువంటి సయ్యద్ అబ్దుల్ అనే వ్యక్తి గమనించి వెంటనే స్పందించి సాయిధరమ్ తేజ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేశారు.
ఇలా యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే స్పందించడంతో సాయి ధరమ్ తేజ ప్రాణాలతో తిరిగి బయటపడ్డారు లేదంటే చాలా పెద్ద ప్రమాదం చోటుచేసుకునేదని చెప్పాలి. అయితే సాయి ధరంతేజ్ తిరిగి కోలుకొని ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్నారు. తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సయ్యద్ అబ్దుల్ గురించి ప్రస్తావన వచ్చింది.
ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ తన గురించి మాట్లాడుతూ తన ప్రాణాలు కాపాడిన వ్యక్తికి డబ్బులు ఇచ్చి తన మానవత్వాన్ని వెలగట్టలేనని అందుకే నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఏ సహాయం కావాలన్నా తనని అడగమని తనకోసం తాను ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానంటూ సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు. ఇలా ఈ వార్తలు వైరల్ కావడంతో మీడియా సయ్యద్ అబ్దుల్ ను సంప్రదించింది.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సాయిధరమ్ తేజ్ నన్ను కలిసి నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారని వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని తెలిపారు. ఇవన్నీ ఒట్టి అవాస్తవాలేనని ఆయన కానీ తన కుటుంబం గానీ ఎవరు నన్ను కలవలేదని తనకు ఎలాంటి సహాయం చేయలేదని తెలిపారు.ఇకపోతే మెగా ఫ్యామిలీ తనకు సహాయం చేశారంటూ వార్తలు రావడంతో తన కొలీగ్స్ అందరూ నన్ను జాక్పాట్ కొట్టావు భారీగా డబ్బు అందుకున్నావ్ అంటూ టార్చర్ చేశారని ఆ టార్చర్ భరించలేక ఉద్యోగం కూడా మానేశానని తెలిపారు.ఒకవేళ సాయి ధరమ్ తేజ్ పిలిస్తే తాను వెళ్తానని ఈ సందర్భంగా అబ్దుల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…