Daggubati Raja: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోను రాజకీయాలలో వారసుల పరంపర కొనసాగడం సర్వసాధారణం. ఇలా ఎంతో మంది సినీ వారసులు రాజకీయ వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి కొనసాగుతూ ఉంటారు. అయితే కొంతమంది ఆ రంగాలలో పెద్దగా రాణించలేక తిరిగి సినీ రంగానికి,రాజకీయ రంగాలకు దూరమవుతూ ఇతర వ్యాపారాలలో స్థిరపడి ఉంటారు.
ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి సురేష్ బాబు వెంకటేష్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రానా కూడా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అయితే ఈ కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగులో కన్నా తమిళంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమైన హీరో ఉన్నారు. మరి అతను ఎవరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే విషయానికి వస్తే…
దగ్గుబాటి రామానాయుడు అన్నయ్య కుమారుడే దగ్గుబాటి రాజా. ఈయన భారతీయ రాజ వద్ద శిక్షణ తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చూడగానే ఆకట్టుకొని రూపంతో ఉన్నటువంటి రాజా తన నటనతో ఎన్నో అద్భుతమైన తమిళ సినిమాలలో నటించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. తెలుగులో రాజా హీరోగా సిరిపురం చిన్నోడు, ఝాన్సీ రాణి, చిన్నారి స్నేహం, వనిత, వంటి పలు సినిమాలలో నటించారు అయితే ఉన్నఫలంగా ఈయనకు అవకాశాలు రాలేదు.
అవకాశాలు లేని సమయంలో తన బాబాయ్ రామానాయుడు దగ్గరకు వెళ్లి ఉంటే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగే వారు కానీ అలా చేయకుండా చెన్నై వెళ్లి తన తండ్రి నిర్వహిస్తున్నటువంటి గ్రానైట్ వ్యాపారాలు చూసుకుంటూ బిజీగా మారిపోయారు.ప్రస్తుతం తన భార్య బిడ్డలతో కలిసి చెన్నైలోనే నివాసం ఉంటున్నారు. ఇక ఏదైనా దగ్గుబాటి ఇంట శుభకార్యాలు జరిగితే ఈయన రామానాయుడు ఫ్యామిలీలో కనిపిస్తూ సందడి చేస్తుంటారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…