Featured

Shakunthalam film story : సమంత నటించిన శాకుంతలం అసలు కథ ఇదే… ఎమోషనల్ కనెక్టివిటీతో ప్రేక్షకులను అలరించనున్న గుణ శేఖర్…!

Shakunthalam film Story : సమంత ప్రధానపాత్రలో తెరకెక్కిన హిస్టారికల్ మూవీ శాకుంతలం. ఇటీవలే విడుదల అయిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఇందులో సమంతకు జోడిగా మలయాళం హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు. శాకుంతలం సినిమా మహా కవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నుండి తీసుకున్న కథ. నీలిమ గుణ, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కథ ఏమిటా అనే ఆసక్తి ట్రైలర్ చూసిన వారిలో కలుగుతోంది. ఇక శాకుంతలం అసలు కథ గురించి తెలుసుకోడానికి ఆరాట పడుతున్నారు చాలా మంది ప్రేక్షకులు.

దుష్యంతుడు, శకుంతల అద్భుత ప్రేమ…

విశ్వామిత్రుడు ఒక యాగం చేస్తున్న సమయంలో అది చెడగొట్టడానికి భూలోకానికి వచ్చిన మేనక ఆయన ద్వారా ఒక బిడ్డకు జన్మనిస్తుంది, ఆ బిడ్డే శకుంతల. మేనక బిడ్డకు జన్మనిచ్చి అక్కడి నుండి స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది. విశ్వామిత్రుడు కూడా పట్టించుకోక వెళ్ళిపోతాడు. అనాధ అయిన శకుంతల కన్వ మహర్షి ఆశ్రమంలో పెరుగుతుంది. అయితే హస్తినాపురపు రాజైన దుష్యంతుడు వేటకోసం అడవికి వచ్చి శకుంతలను చూసి ఇష్టపడుతాడు. అదే సమయంలో కన్వ మహర్షి యాత్రలో ఉండటంతో శకుంతల దుష్యంతుడు గంధర్వ వివాహం చేసుకుంటారు. దుష్యంతుడు తిరిగి రాజ్యానికి వెళ్ళేటపుడు శకుంతలకు ఒక ఉంగరం మీది అక్షరాలు లెక్కబెట్టేలోపు వస్తానని వెళ్తాడు. అయితే శంకుంతల దుష్యంతుడి ఆలోచనలో పడి ఒకరోజున దూర్వస మహర్షి వచ్చిన సంగతి పట్టించుకోదు. దీంతో కోపగించుకుని మహర్షి నీవు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో వాళ్ళు నిన్ను మర్చిపోతారని శపిస్తాడు. దీంతో దుష్యంతుడు శకుంతల గురించి పూర్తిగా మర్చిపోతాడు. ఇక మహర్షి శాపం గురించి కూడా పట్టించుకోకుండా పరధ్యానంలో ఉంటే ఆమె చెలికత్తెలు మహర్షిని వేడుకొనగా జాలి పడి ఏదైనా వారిద్దరికీ సంబంధించిన వస్తువు చూపితే గుర్తు పడతారని చెప్పి వెళ్ళిపోతాడు.

ఎంతకీ దుష్యంతుడి నుండి పిలుపు రాకపోవడంతో, ఆశ్రమానికి వచ్చిన కన్వ మహర్షికి శకుంతల వివాహ గురించి తెలిసీ అత్తారింటికి పంపిస్తాడు. ఇక దుష్యంతుడి రాజ్యానికి వెళ్లిన శాకుంతల దారిలో నదిలో ఉంగరం చేజార్చుకుంటుంది. ఇక ఎంత చెప్పినా దుష్యంతుడు గుర్తుపట్టకపోవడంతో అటు అక్కడ ఉండలేక ఇటు ఆశ్రమానికి తిరిగిరాలేక ఇబ్బందిపడుతున్న సమయంలో తల్లి మేనక ఆమెను మరో ఆశ్రమానికి చేరుస్తుంది. ఇక శంకుంతలకు భరతుడు జన్మిస్తాడు. ఇటు నదిలోపడిన ఉంగరం ఒక చేప మింగడంతో ఆ చేప ఒక జాలేరికి దొరికి అలా ఉంగరం చివరికి రాజు దుస్యంతుడి వద్దకు చేరుతుంది. ఆ తరువాత మొత్తం గుర్తుకు వచ్చిన దుష్యంతుడు శకుంతల, భరతుడిని కలుసుకుంటాడు. ఇక ఈ కథలో లవ్, ఎమోషన్స్ బాగా పండుతాయి. మరి ఈ కథను గుణశేఖర్ దృశ్యకావ్యంగా ఎలా మలిచాడో ఫిబ్రవరి 17 దాకా ఎదురుచూడాల్సిందే.

Bhargavi

Recent Posts

40 దాటినా ఫిట్‌గా రొనాల్డో… ఈ ఒక్క అలవాటు మీకూ మార్పు తీసుకురాగలదు!

ఫుట్‌బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో ​​రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…

7 minutes ago

బుద్ధ పౌర్ణిమ 2026: ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన పవిత్ర దినం.. ప్రాముఖ్యత, ఆచరణ విధానం!

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…

15 minutes ago

కళ్ల సమస్యలు పోతాయట! ఈ వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…

33 minutes ago

ట్రెండ్ కోసం ఈ పేర్లు పెడుతున్నారా? మీ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడొచ్చు!

పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…

41 minutes ago

డబ్బు కలలు వస్తున్నాయా? మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది!

నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…

50 minutes ago

పరశురామ ద్వాదశి ప్రత్యేకత ఏమిటి?.. భక్తులు ఎందుకు చేస్తారు?

హిందూ పంచాంగంలో ప్రతి పర్వదినానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో వైశాఖ మాసంలో వచ్చే పరశురామ ద్వాదశి కూడా…

59 minutes ago