Shruti Hassan: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్న కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన శృతిహాసన్ కి ఆ ఇండస్ట్రీలో సరైన హిట్స్ లేకపోయినా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమైన శృతిహాసన్ క్రాక్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.
ఇక ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే ప్రభాస్ సరసన సలార్ సినిమాలో కూడా నటిస్తూ శృతిహాసన్ ఇప్పుడు చాలా బిజీ అయింది. అయితే శృతిహాసన్ నటించిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు ఈ సంక్రాంతికి థియేటర్లలో పోటీ పడనున్నాయి. ఏ సినిమా హిట్ అయినా కూడా అది శృతిహాసన్ కి ప్లస్ పాయింట్ .
కొన్ని రోజులుగా శృతిహాసన్ గురించి సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. బాలకృష్ణ చిరంజీవి వంటి సీనియర్ హీరోల సరసన నటించడంతో శృతిహాసన్ కి అవకాశాలు లేక, డబ్బు సంపాదించడానికి ఇలా సీనియర్ హీరోలతో నటించటానికి ఒప్పుకుందని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ వార్తలపై స్పందించిన శృతిహాసన్ తనని ట్రోల్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది.
తాజాగా ట్రోలింగ్ గురించి స్పందిస్తూ..సినిమా ఇండస్ట్రీలో వయసు అన్నది ఒక నెంబర్ మాత్రమేనని.. మనలో టాయిలెట్ ఉంటే మనం మరణించే వరకు సినిమాలలో నటించవచ్చు. అలాగే ఎంతోమంది సీనియర్ హీరోలు తమ వయసులో సగం వయసు ఉన్న హీరోయిన్లతో నటించి సినిమాలు చేయటానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు. తనకన్నా రెట్టింపు వయసు ఉన్న హీరోలతో నటించడంలో తప్పు లేదని, ఆ విషయంలో మాత్రం తాను అతీతం కాదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి ఎంతోమంది స్టార్ హీరోలు తమ కన్నా తక్కువ వయసు ఉన్న హీరోయిన్లతో నటించారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…