Siddhartha: ముంబై లో జంటగా మీడియా కంట పడిన సిద్ధార్థ, అధితి రావు హైదరీ… వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారా..?

Siddhartha : ‘బాయ్స్’ సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైన హీరో సిద్ధార్థ ఆ తరువాత ‘యువ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో బాగా ఫేమస్ అయ్యాడు. సిద్ధార్థ అంటే అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అయితే చుక్కల్లో చంద్రుడు వంటి డిజాస్టర్ తరువాత సిద్ధార్థ జోరు తెలుగులో తగ్గింది. ఎన్టీఆర్ ‘బాద్ షా’ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించిన సిద్ధు, ఆ తరువాత మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.

ప్రేమలో పడ్డ సిద్ధు..?

చాలా గ్యాప్ తరువాత శర్వానంద్ సినిమా మహా సముద్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ కు ఆ సినిమా బాగా ప్లస్ అవుతుందనుకుంటే నిరాశే మిగిల్చింది. అయితే ఆ సినిమాలో సిద్ధూకి జంటగా అధితి రావు హైదరీ నటించింది. ఇక సినిమాలో సిద్ధూ పాత్రకి దర్శకుడు న్యాయం చేయకపోయినా అధితి రావు, సిద్ధూ మధ్య రొమాన్స్ మాత్రం బాగా చూపించాడు.

ఇక ఈసినిమా తరువాత వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కడా అనుమానం రాకపోయినా తాజాగా ముంబై లో ఒకే గదిలో నుండి బయటకు వస్తూ మీడియా కంట పడ్డారు. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అది కాక ఫోటోలు తీసే సరికి మీడియా మీద ఫైర్ అయ్యాడు సిద్ధూ. మరి నిజంగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారో లేక ఒట్టి రూమర్స్ మాత్రమేనా అనేది తెలియాలి. ఇక సిద్ధూ కి ఇండస్ట్రీ కి వచ్చినపుడే పెళ్లయింది. ఇక భార్య తో వీడిపోయాక సమంత తో కొద్దికాలం డేట్ చేసాడు సిద్ధూ. ప్రస్తుతం సిద్ధార్థ మళ్ళీ తెలుగు సినిమాలపై దృష్టి పెట్టాడు.