Siri -Shanmukh: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్లుగా పాల్గొన్నటువంటి యూట్యూబర్స్ సిరి, షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబర్స్ గా వీరిద్దరూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్నో వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వీరిద్దరూ బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ గా అవకాశాన్ని అందుకున్నారు. ఇకపోతే కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడంతో ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు.
వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లకముందు ఇద్దరు కూడా వేరే వ్యక్తులతో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే అయినప్పటికీ ఆ విషయాన్ని మరిచిపోయి సిరి షణ్ముఖ్ చాలా క్లోజ్ గా ఉండడం చేత దీప్తి సునయన షణ్ముఖ్ జస్వంత్ కిబ్రేకప్ చెప్పేసారు. అయితే ఈమె వ్యవహారం గనక చూస్తే తిరిగి తనతో మాట్లాడే ఉద్దేశం కూడా లేదని తెలుస్తుంది.
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపు సిరి పరిస్థితి కూడా బ్రేకప్ వరకు వెళ్లిందని అనంతరం వీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో సిరి శ్రీహాన్ రిలేషన్ కంటిన్యూ అవుతుందని చెప్పాలి. అయితే ఇంత జరిగిన తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సిరి షణ్ముఖ్ కి పూర్తిగా దూరంగా ఉంటున్నారు ఎక్కడ కూడా వీరిద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు లేవు అయితే ఇలా ఈమె తనకు దూరంగా ఉండడానికే గల కారణాన్ని కూడా ఓ సందర్భంగా తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సిరి తాను కావాలనే షణ్ముఖ్ కిదూరంగా ఉండడం లేదని తెలిపారు. అయితే తన జీవితంలో ఇలా జరుగుతుందని తాను అసలు ఊహించుకోలేదని ఈమె తెలిపారు. షణ్ముఖ్ దీప్తి బ్రేకప్ జరిగిన తర్వాత మా ఇద్దరి మధ్య కాంటాక్ట్ ఉండటం సరికాదని అనిపించిందని అందుకే తనకు దూరంగా ఉంటున్నానని తెలిపారు ఇక మేము ఎక్కడున్నా ఒకరి మంచి గురించి మరొకరు ఆలోచిస్తూ ఉంటామని ఈ సందర్భంగా సిరి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…