Lakshmi Parvathi : లక్ష్మి పార్వతి అనగానే ఎన్టీఆర్ గారి రెండో భార్యగా అందరికీ తెలుసు. అయితే లక్ష్మి పార్వతి గారు మొదట ఎన్టీఆర్ గారి చరిత్ర రాయడానికి ఆయన వద్దకు వచ్చి ఆ తరువాత ఆయనకు నచ్చిన వ్యక్తిగా మారారు. ఇక ఆయన మరణం తరువాత పార్టీ పగ్గాలను తీసుకోవాలని భావించినా నందమూరి కుటుంబం నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టినా పెద్దగా రాజకీయంగా ఆమెకు కలిసి రాలేదు. ఇన్నాళ్లు పెద్దగా కనిపించని లక్ష్మి పార్వతి ప్రస్తుతం వైసీపీ పార్టీలో చేరి జగన్ తరుపున టీడీపీ ని విమర్శిస్తూ మీడియాతో తన జీవిత విశేషాలను పంచుకుంటూ ఉంటారు.
నన్ను తిక్కలదానివి నువ్వు అంటారు… నేనేంటే చాలా ఇష్టం…
డాక్టరేట్ తీసుకుని తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ మాట్లాడగల నేను ఎన్టీఆర్ గారితో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి పార్టీ విజయంలో దోహదపడ్డాను. ఆయనతో వెళ్లి నేను ప్రచారం చేసి 256 సీట్లలో విజయం సాధించుకువచ్చాను అయినా నాకేమి అందులో క్రెడిట్ లేదు, అయినా కానీ ఏనాడూ పదవులను ఆశించలేదు. నాకు రెండు సార్లు రామారావు గారు కీలక పదవులను ఆఫర్ చేసినా నేను ఆయన భార్యగా ఉండటానికి ఇష్టపడ్డాను కానీ పదవులను తీసుకోవాలని అనుకోలేదు.
అందుకే ఆయన నన్ను నువ్వు తిక్కలదానివి అంటూ తిట్టేవారు. ఏనాడూ నాకు పదవీ వ్యామోహం లేదు అంటూ లక్ష్మి పార్వతి తెలిపారు. ఎన్టీఆర్ గారికి నేనంటే చాలా ఇష్టం ఆయనకు కోపం వచ్చినా బాగా తిట్టేవాడు అలాగే ప్రేమ వచ్చినా మేరే యార్ అంటూ పిలిచేవాడు అంటూ అప్పటి ముచ్చట్లను పంచుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…