Tag Archives: జబర్దస్త్

Anchor Anasuya: దారుణమైన దెబ్బ తిన్నాను…. నాలా ఎవరు బాధపడలేదేమో…. అనసూయ పోస్ట్ వైరల్!

Anchor Anasuya: చిత్ర పరిశ్రమలో యాంకర్ గా నటిగా, ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి గ్లామరస్ యాంకర్ అనసూయ గురించి అందరికీ సుపరిచితమే.కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా తన కెరియర్ ప్రారంభించిన అనసూయ అనంతరం యాంకర్ గా మారిపోయారు. ఇలా పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేసినటువంటి ఈమెకు జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది.

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ఇదే పాపులారిటీతో ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా వరుస సినిమా అవకాశాలు రావడంతో అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు.ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొనే అనసూయ కొన్నిసార్లు తను చేసే పోస్టుల వల్ల నేటిజన్ల నుంచి తీవ్రమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. ఇలా పలుమార్లు నేటిజన్లో ట్రోలింగ్ గురైన ఈమె ఏమాత్రం వెనకడుగు వేయకుండా వారికి దీటుగా తన స్టైల్ లో సమాధానం చెప్పారు.

Anchor Anasuya: బాధాకరమైన పోస్ట్ షేర్ చేసిన అనసూయ…

ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక బాధాకరమైన పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పోస్ట్ చేస్తూ నేను బాగా దెబ్బ తిన్నాను. నేను బాధపడినంతగా బహుశా ఎవరుబాధపడలేదేమో అంటూ ఈ సందర్భంగా ఈమె పోస్ట్ చేయడంతో అనసూయను ఇంతలా బాధ పెట్టినది ఎవరు అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Anchor Anasuya: యాంకర్ అనసూయ భర్త గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Anchor Anasuya: బుల్లితెర జబర్దస్త్ యాంకర్ గా, వెండితెర రంగమ్మత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి అందరికీ సుపరిచితమే. న్యూస్ రిప్రజెంటేటర్ గా పని చేస్తున్నటువంటి ఈమె అనంతరం సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు. అయితే ఏవి గుర్తింపు తీసుకురాలేదని చెప్పాలి.జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన అనసూయకు ఈ కార్యక్రమం ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.

ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి అనసూయ ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుని వెండితెర అవకాశాలను అందుకున్నారు.ఇలా రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన తర్వాత ఈమె వెండితెరపై కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలా వరుస సినిమాలతోను వెబ్ సిరీస్ లతోను ఎంతో బిజీగా గడుపుతున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇలా మృతి పరమైన జీవితంలో ఎంతో సక్సెస్ అయినటువంటి అనసూయ వ్యక్తిగత విషయానికి వస్తే… సుశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీరి వివాహం జరిగి 12 సంవత్సరాలు పూర్తి కావడంతో తమ 12వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇక అనసూయ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే.

Anchor Anasuya: ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా పనిచేస్తున్న సుశాంక్ భరద్వాజ్…

అనసూయ ఎన్ సీసీలో ఉన్న సమయంలో సుశాంక్ భరద్వాజ్ తో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక అనసూయ భర్త సుశాంక్ ఫైనాన్షియర్, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా పనిచేస్తున్నారు. ఈయన తన వృత్తి విషయంలో బిజీగా ఉండగా,అనసూయ సైతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతూ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

Actress Kushbu: ఆమెను తలుచుకొని షో లోనే కన్నీళ్లు పెట్టుకున్న కుష్బూ.. వైరల్ వీడియో?

Actress Kushbu: బుల్లితెర పై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది.ఈ కార్యక్రమం మొదట్లో జబర్దస్త్ కార్యక్రమం ఒకటే కొనసాగుతుండగా ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ రావడంతో ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం ప్రసారమవుతు పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తోంది.

ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా తమదైన శైలిలో పెర్ఫార్మెన్స్ చేస్తూ అందరిని నవ్వించారు. ఇక గెటప్ శీను ఈసారి టైం ఫాంటసీ స్కిట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా తన స్కిట్ తో అందరిని సందడి చేశారు.

అనంతరం యాంకర్ రష్మీ మాట్లాడుతూ ఒకవేళ టైం ట్రావెల్ చేస్తే ఏం జరగాలని కోరుకుంటారు అంటూ అందరిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇదే ప్రశ్నను యాంకర్ రష్మీ జడ్జి స్థానంలో ఉన్నటువంటి కుష్బూని అడగడంతో కుష్బూ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఏకంగా ఎమోషనల్ అవ్వడమే కాకుండా కన్నీళ్లు పెట్టుకున్నారు.

Actress Kushbu: ఆమె ఎప్పటికీ నాతోనే ఉండాలి…

ఈ సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి 1984లో ఇండస్ట్రీలోకి వచ్చాను. అదే సమయంలో తన హెయిర్ డ్రెస్సర్ ఉబెన్ ఆంటీ వచ్చారు.ఆమె నాతోపాటు 2011 వరకు కలిసి ఉంది. అయితే క్యాన్సర్ తో ఆమె 2011లో మరణించారు. ఒకవేళ నేనే కనుక జీవితంలో వెనక్కి వెళ్లాల్సి వస్తే ఆమె ఎప్పటికీ నాతోనే ఉండాలని కోరుకుంటాను అంటూ కుష్బూ ఒక్కసారిగా తన హెయిర్ డ్రెస్సర్ ను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sudigali Sudheer: ఆ ఒక్క కారణంతోనే సుధీర్ కేరీర్ నాశనమైందా… బాధపడుతున్న అభిమానులు!

Sudigali Sudheer: బుల్లితెర మెగాస్టార్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు సుడిగాలి సుదీర్. మెజీషియన్ గా పని చేస్తున్నటువంటి ఇతనికి జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం కల్పించారు. వేణు వండర్స్ టీం లో సుడిగాలి సుదీర్ కమెడియన్ గా చేస్తూ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా ఎదిగారు. ఇలా టీం లీడర్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ కు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకరింగ్ చేసే అవకాశం కూడా వచ్చింది.

ఇలా బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి సుడిగాలి సుదీర్ కు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.ఇలా వెండితెరపై బుల్లితెరపై సందడి చేస్తున్నటువంటి ఈయన క్రమంగా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు దూరమయ్యారు. అయితే ఈయన ఈ కార్యక్రమాలకు దూరం కావడానికి గల కారణం ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయమే కారణమని తెలుస్తుంది.

స్టార్ మా లో ప్రముఖ యాంకర్ ఓంకార్ కామెడీ స్టార్స్ అనే కార్యక్రమాన్ని స్థాపించారు.ఈ కార్యక్రమం జబర్దస్త్ కార్యక్రమంతో పాటు కొనసాగుతూ వచ్చింది. అయితే మొదటి వారం ఎంతో అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకోవడంతో ఎంతో మంది జబర్దస్త్ కమెడియన్స్ చూపు మొత్తం ఈ కార్యక్రమం పై పడింది.ఇక ఓంకార్ సైతం జబర్దస్త్ కార్యక్రమంలో ఇచ్చే రెమ్యూనరేషన్ కన్నా రెండింతల రెమ్యూనరేషన్ ఆశ చూపించడంతో ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్స్ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి కామెడీ స్టార్స్ కార్యక్రమానికి వచ్చారు.

Sudigali Sudheer: డౌన్ ఫాల్ అవుతున్న సుధీర్ కెరియర్…

ఈ విధంగా జబర్దస్త్ వదిలి వచ్చిన వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు.అయితే ఈయన బయటికి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఈ కార్యక్రమాన్ని మోసివేయడంతో సుడిగాలి సుదీర్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం కూడా పూర్తి కావడంతో సుధీర్ ఏ విధమైనటువంటి అవకాశాలు లేక ఖాళీగా ఉన్నారు.త్వరలోనే ఆహాలో మరొక కామెడీ షో ప్రారంభమవుతుందని తద్వారా సుధీర్ సందడి చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమం మరి కాస్త ఆలస్యమైతే సుదీర్ కెరియర్ పూర్తిగా డేంజర్ జోన్ లో పడుతుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.