Sudigali Sudheer: బుల్లితెర మెగాస్టార్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు సుడిగాలి సుదీర్. మెజీషియన్ గా పని చేస్తున్నటువంటి ఇతనికి జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం కల్పించారు. వేణు వండర్స్ టీం లో సుడిగాలి సుదీర్ కమెడియన్ గా చేస్తూ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా ఎదిగారు. ఇలా టీం లీడర్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ కు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకరింగ్ చేసే అవకాశం కూడా వచ్చింది.
ఇలా బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి సుడిగాలి సుదీర్ కు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.ఇలా వెండితెరపై బుల్లితెరపై సందడి చేస్తున్నటువంటి ఈయన క్రమంగా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు దూరమయ్యారు. అయితే ఈయన ఈ కార్యక్రమాలకు దూరం కావడానికి గల కారణం ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయమే కారణమని తెలుస్తుంది.
స్టార్ మా లో ప్రముఖ యాంకర్ ఓంకార్ కామెడీ స్టార్స్ అనే కార్యక్రమాన్ని స్థాపించారు.ఈ కార్యక్రమం జబర్దస్త్ కార్యక్రమంతో పాటు కొనసాగుతూ వచ్చింది. అయితే మొదటి వారం ఎంతో అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకోవడంతో ఎంతో మంది జబర్దస్త్ కమెడియన్స్ చూపు మొత్తం ఈ కార్యక్రమం పై పడింది.ఇక ఓంకార్ సైతం జబర్దస్త్ కార్యక్రమంలో ఇచ్చే రెమ్యూనరేషన్ కన్నా రెండింతల రెమ్యూనరేషన్ ఆశ చూపించడంతో ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్స్ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి కామెడీ స్టార్స్ కార్యక్రమానికి వచ్చారు.
ఈ విధంగా జబర్దస్త్ వదిలి వచ్చిన వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు.అయితే ఈయన బయటికి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఈ కార్యక్రమాన్ని మోసివేయడంతో సుడిగాలి సుదీర్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం కూడా పూర్తి కావడంతో సుధీర్ ఏ విధమైనటువంటి అవకాశాలు లేక ఖాళీగా ఉన్నారు.త్వరలోనే ఆహాలో మరొక కామెడీ షో ప్రారంభమవుతుందని తద్వారా సుధీర్ సందడి చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమం మరి కాస్త ఆలస్యమైతే సుదీర్ కెరియర్ పూర్తిగా డేంజర్ జోన్ లో పడుతుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…