Sudigali Sudheer: బుల్లితెర మెగాస్టార్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు సుడిగాలి సుదీర్. మెజీషియన్ గా పని చేస్తున్నటువంటి ఇతనికి జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం కల్పించారు. వేణు వండర్స్ టీం లో సుడిగాలి సుదీర్ కమెడియన్ గా చేస్తూ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా ఎదిగారు. ఇలా టీం లీడర్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ కు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకరింగ్ చేసే అవకాశం కూడా వచ్చింది.
ఇలా బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి సుడిగాలి సుదీర్ కు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.ఇలా వెండితెరపై బుల్లితెరపై సందడి చేస్తున్నటువంటి ఈయన క్రమంగా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు దూరమయ్యారు. అయితే ఈయన ఈ కార్యక్రమాలకు దూరం కావడానికి గల కారణం ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయమే కారణమని తెలుస్తుంది.
స్టార్ మా లో ప్రముఖ యాంకర్ ఓంకార్ కామెడీ స్టార్స్ అనే కార్యక్రమాన్ని స్థాపించారు.ఈ కార్యక్రమం జబర్దస్త్ కార్యక్రమంతో పాటు కొనసాగుతూ వచ్చింది. అయితే మొదటి వారం ఎంతో అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకోవడంతో ఎంతో మంది జబర్దస్త్ కమెడియన్స్ చూపు మొత్తం ఈ కార్యక్రమం పై పడింది.ఇక ఓంకార్ సైతం జబర్దస్త్ కార్యక్రమంలో ఇచ్చే రెమ్యూనరేషన్ కన్నా రెండింతల రెమ్యూనరేషన్ ఆశ చూపించడంతో ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్స్ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి కామెడీ స్టార్స్ కార్యక్రమానికి వచ్చారు.
ఈ విధంగా జబర్దస్త్ వదిలి వచ్చిన వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు.అయితే ఈయన బయటికి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఈ కార్యక్రమాన్ని మోసివేయడంతో సుడిగాలి సుదీర్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం కూడా పూర్తి కావడంతో సుధీర్ ఏ విధమైనటువంటి అవకాశాలు లేక ఖాళీగా ఉన్నారు.త్వరలోనే ఆహాలో మరొక కామెడీ షో ప్రారంభమవుతుందని తద్వారా సుధీర్ సందడి చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమం మరి కాస్త ఆలస్యమైతే సుదీర్ కెరియర్ పూర్తిగా డేంజర్ జోన్ లో పడుతుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…