Tag Archives: aadi purush

Venu Swamy: ఆది పురుష్ విడుదలకు ముందే సినిమా రిజల్ట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి..?

Venu Swamy: ప్రముఖ దర్శకుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరచూ సెలబ్రిటీల జాతకాల గురించి సంచలనం వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న వేణుస్వామి బాగా పాపులర్ అయ్యాడు. అయితే కొన్ని సందర్భాలలో వేణు స్వామి చెప్పిన మాటలు నిజం కావటం వల్ల కొందరు సెలబ్రిటీలు ఆయన వద్దకు వెళ్ళి భవిషత్తు బాగుండాలని పూజలు చేయించుకుంటున్నారు. ఇదిలా ఉండగా హీరో ప్రభాస్ గురించి వేణు స్వామి ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇక తాజాగా మరొకసారి ప్రభాస్ గురించి ఆయన నటించిన ఆది పురుష్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఆ స్థాయిలో హిట్ లభించలేదు. ఆది పురుష్ సినిమా అయినా బాహుబలి స్ధాయిలో హిట్ అవుతుందని అభిమానులు ఆశతో ఉన్నారు. ఈ క్రమంలోనే సినిమా రిజల్ట్ గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి ని ఆది పురుష్ రిజల్ట్ గురించి ప్రశ్నించగా.. వేణు స్వామి స్పందిస్తూ..

Venu Swamy: ఆశించిన ఫలితాలు ఉండవు..


ప్రభాస్ జాతకరిత్యా ఆదిపురుష్ మూవీ సంచలనాలు సృష్టించే అవకాశం అయితే లేదని వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ నుండి బాహుబలి స్థాయి హిట్ ను ఆశించవద్దని తెలిపాడు. ప్రభాస్ జాతకంలో దోషాలు ఉన్నాయని, ఆయన సినీ జీవితంలో హిట్స్ అందుకునే అవకాశాలు లేవని తెలిపాడు. ఇక ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని వేణుస్వామి చేసిన కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి.

Kriti Sanon: రాముడిలాగే ప్రభాస్ మంచివాడు… ప్రశంసలు కురిపించిన కృతి సనన్!

Kriti Sanon: కృతి సనన్ ప్రభాస్ జంటగా ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి గతంలో టీజర్ పోస్టర్లు విడుదల చేయగా ఈ టీజర్ తీవ్ర స్థాయిలో వివాదాలకు కారణమయ్యాయి.

ఈ సినిమా నుంచి టీజర్ కనుక చూస్తే చిన్న పిల్లలు కార్టూన్ ఛానల్ చూసినట్టు ఉందంటూ ఎన్నో విమర్శలు వెళ్లిపోతాయి అయితే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఒక విజువల్ వండర్ లా ఉందని చెప్పాలి టీజర్ తో పోలిస్తే ట్రైలర్ 100 రెట్లు మెరుగ్గా ఉందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ టీజర్ లో సీతను రావణాసురుడు ఎత్తుకెళ్లిపోవడం శబరి ఎంగిలి పనులను రాముడు తినడం హనుమంతుడు సీత కోసం వెతకడం, హనుమంతుడు లంకకు నిప్పు పెట్టే వంటి సన్నివేశాలు అన్నింటినీ ఎంతో అద్భుతంగా చూపించారు. ఇలా ఈ సినిమా ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా కృతి సనన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రశంసల కురిపించారు.

Kriti Sanon: ప్రభాస్ ప్రశంసలు కురిపించిన కృతి సనన్..

రాముడు లాగే ప్రభాస్ కూడా చాలా మంచివాడు అంటూ తనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలా ప్రభాస్ గురించి కృతి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, మాల్దీవ్స్ లో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలను ఇటు ప్రభాస్ టీం అలాగే కృతి టీం ఇద్దరు కూడా ఖండించారు.

Kriti Sanon: నటి కృతి సనన్ ప్రవేట్ పార్ట్స్ పై దారుణమైన కామెంట్స్.. హెడ్ లైన్స్ లో నిలిచిన కృతి సనన్?

Kriti Sanon: కృతి సనన్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఇలా ఈ సినిమాలో కృతి సనన్ గ్లామర్ వలకబోసిన పెద్దగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు ఈ సినిమా అనంతరం నాగచైతన్య సరసన దోచేయ్ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పి బాలీవుడ్ ఇండస్ట్రీలో మకాం వేశారు.

ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే కెరియర్ మొదట్లో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ఇక ఇండస్ట్రీలో ఓ నటి నన్ను సాటి మహిళ అని కూడా చూడకుండా దారుణంగా నా ప్రవేట్ పార్ట్స్ పై కామెంట్ చేశారంట తాజాగా ఈమె ఫిలింఫేర్ అవార్డు వేడుకలో భాగంగా తాను ఎదుర్కొన్న బాడీ షేవింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా జరిగిన ఫిలింఫేర్ అవార్డు కార్యక్రమాల్లో భాగంగా కృతి సనన్ నటించిన మిమి సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా అవార్డు వరించింది.ఈ అవార్డు వేడుకలో భాగంగా తాను బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో ఓ నటి మహిళగా చూడకుండా ఆమెకు హెడ్ లైట్స్ లేవు.. బంపర్ కూడా లేదు..’ అంటూ వెటకారం చేసిందని ఇలా తన ప్రైవేట్ పార్ట్స్ గురించి దారుణమైన కామెంట్స్ చేశారని ఈ సందర్భంగా ఈ విషయాన్ని బయట పెట్టారు.

Kriti Sanon: మహిళ అని కూడా చూడలేదు…

ఇలా ఆరోజు ఎదుర్కొన్న అవమానంతో తాను ఎంతో కసిగా విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకొని నేడు అగ్రతారగా హెడ్ లైన్స్ లో నిలబడ్డానని ఈ సందర్భంగా కృతి సనన్ గతంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి బయటపెట్టారు.ఇకపోతే తెలుగులో రెండు సినిమాలకే పరిమితమైన ఈమె తాజాగా ప్రభాస్ సరసన నటించిన ఆది పురుష్ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ప్రభాస్ 25 వ చిత్రంగా స్పిరిట్.. ఆకట్టుకుంటున్న టైటిల్ పోస్టర్!

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ తాజాగా తన 25వ చిత్రానికి సంబంధించిన సరికొత్త అప్డేట్ విడుదల చేశారు.

ప్రభాస్ తన 25వ చిత్రంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో, యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మాణంలో “స్పిరిట్”అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు చిత్రబృందం నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే టైటిల్ తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ పోస్టర్ చూసిన ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా ఇది వరకు ప్రభాస్ ను ఎప్పుడూ చూడని జానర్ లో సందీప్ రెడ్డి వంగ చూపించబోతున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరికొంత సమాచారాన్ని తెలియజేయనున్నారు.

ఇకపోతే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. అదేవిధంగా ప్రభాస్ హీరోగా ప్రస్తుతం సలార్, ఆది పురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ప్రభాస్ తన 25వ చిత్రం కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.