Kriti Sanon: కృతి సనన్ ప్రభాస్ జంటగా ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి గతంలో టీజర్ పోస్టర్లు విడుదల చేయగా ఈ టీజర్ తీవ్ర స్థాయిలో వివాదాలకు కారణమయ్యాయి.
ఈ సినిమా నుంచి టీజర్ కనుక చూస్తే చిన్న పిల్లలు కార్టూన్ ఛానల్ చూసినట్టు ఉందంటూ ఎన్నో విమర్శలు వెళ్లిపోతాయి అయితే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఒక విజువల్ వండర్ లా ఉందని చెప్పాలి టీజర్ తో పోలిస్తే ట్రైలర్ 100 రెట్లు మెరుగ్గా ఉందని అభిమానులు భావిస్తున్నారు.
ఈ టీజర్ లో సీతను రావణాసురుడు ఎత్తుకెళ్లిపోవడం శబరి ఎంగిలి పనులను రాముడు తినడం హనుమంతుడు సీత కోసం వెతకడం, హనుమంతుడు లంకకు నిప్పు పెట్టే వంటి సన్నివేశాలు అన్నింటినీ ఎంతో అద్భుతంగా చూపించారు. ఇలా ఈ సినిమా ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా కృతి సనన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రశంసల కురిపించారు.
రాముడు లాగే ప్రభాస్ కూడా చాలా మంచివాడు అంటూ తనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలా ప్రభాస్ గురించి కృతి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, మాల్దీవ్స్ లో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలను ఇటు ప్రభాస్ టీం అలాగే కృతి టీం ఇద్దరు కూడా ఖండించారు.
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…
ఇటీవలి కాలంలో “2026లో ప్రపంచ యుద్ధం జరుగుతుందా?” అనే చర్చలు సోషల్ మీడియాలో వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా పురాణాల్లోని కొన్ని…
పూజా గదిలో నీళ్లు ఉంచే ఆచారం వెనుక అసలు కారణం ఏమిటి? చాలా మంది ఇళ్లలో ఇది సాధారణంగా కనిపించే…
జన్మతేదీల ఆధారంగా వ్యక్తిత్వం, ఆర్థిక స్థితి గురించి అంచనాలు చెప్పే సంఖ్యాశాస్త్రంపై ఆసక్తి పెరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని…
వయస్సు పెరగడం సహజ ప్రక్రియే. అయితే సరైన జీవనశైలిని పాటిస్తే వృద్ధాప్య ప్రభావాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు…