బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ తాజాగా తన 25వ చిత్రానికి సంబంధించిన సరికొత్త అప్డేట్ విడుదల చేశారు.
ప్రభాస్ తన 25వ చిత్రంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో, యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మాణంలో “స్పిరిట్”అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు చిత్రబృందం నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే టైటిల్ తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే ఈ పోస్టర్ చూసిన ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా ఇది వరకు ప్రభాస్ ను ఎప్పుడూ చూడని జానర్ లో సందీప్ రెడ్డి వంగ చూపించబోతున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరికొంత సమాచారాన్ని తెలియజేయనున్నారు.
ఇకపోతే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. అదేవిధంగా ప్రభాస్ హీరోగా ప్రస్తుతం సలార్, ఆది పురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ప్రభాస్ తన 25వ చిత్రం కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…