సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు ఉండగా అందులో ఎన్నో సినిమాలు రూపొందుతున్నాయి. ఇక పలువురు నిర్మాతలు కూడా సొంతంగా నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా మరో నిర్మాత యార్లగడ్డ వెంకటరమణ కూడా ‘సాయిరాం ప్రొడక్షన్’ అనే నిర్మాణ సంస్థను పూజా కార్యక్రమాలతో ఆవిర్భవించాడు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా తనికెళ్ల భరణి పాల్గొన్నాడు.
ఇక యార్లగడ్డ ప్రేక్షకులకు మంచి సినిమాలను అందించాలన్న కోరికతో ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఇందులో ఎక్కువగా యువకులను, మంచి ప్రతిభ ఉన్న వ్యక్తులను ప్రోత్సహించాలన్న ఆలోచనలో యార్లగడ్డ ఉన్నారని తెలుస్తుంది. ఇక త్వరలోనే రెండు సినిమాలను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారట.
పైగా శ్రీపాల్ రెడ్డి, వీర అనే దర్శకులు తమ దర్శకత్వంలో ఈ నిర్మాణ సంస్థలో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల గురించి త్వరలోనే తెలుపుతామని ప్రకటించారు. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపాడు వెంకటరమణ.
తనికెళ్ల భరణి ఆశీస్సులు కూడా తమకు ఉన్నాయని తెలిపాడు. తనికెళ్ళ భరణి కూడా కొన్ని విషయాలు పంచుకోగా.. సాయిరాం ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ మంచి రోజు ప్రారంభమవడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఇక కొన్ని విషయాలు పంచుకుంటూ..ఈ నిర్మాణ సంస్థలో వచ్చే సినిమా స్క్రిప్టులు చాలా బాగున్నాయని త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామని తెలిపాడు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…