Tag Archives: actress jayasudha

Actress Jayasudha: మూడో పెళ్లి చేసుకున్న జయసుధ…. ఆ వ్యక్తి గురించి క్లారిటీ ఇచ్చేసిందిగా?

Actress Jayasudha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జయసుధ అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఈమె సీనియర్ హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్నార్ నుంచి చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోల సరసన కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే గత కొద్దిరోజులుగా జయసుధ మూడో పెళ్లి చేసుకుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈమె ఏ కార్యక్రమానికి వెళ్లిన ఈమె పక్కనే ఒక వ్యక్తి కనిపించడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.ఇలా జయసుధ రహస్యంగా మూడో వివాహం చేసుకున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా ఈమె హీరో విజయ్ నటించిన వారసుడు సినిమాలో కూడా నటించారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా ఆ వ్యక్తి జయసుధ పక్కనే ఉండడం గమనార్హం. ఇలా ఏ కార్యక్రమానికి వెళ్లిన తను జయసుధ వెంట ఉండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.అయితే తాజాగా జయసుధ తన మూడో పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించి ఆ వ్యక్తి ఎవరు తనకు ఆ వ్యక్తికి సంబంధం ఏంటి అనే విషయాలను తెలియచేశారు.

Actress Jayasudha: నా బయోపిక్ చిత్రం కోసం నన్ను ఫాలో అవుతున్నారు…

ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ ప్రతి కార్యక్రమంలోనూ తన పక్కనే ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరు పెలిపే.తాను అమెరికాలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారని అయితే ఆయన తనకు మంచి స్నేహితుడిని జయసుధ తెలిపారు.ఆయన తన బయోపిక్ చిత్రం చేయాలని భావిస్తున్నారు అందుకే తన గురించి ఇంటర్నెట్ మొత్తం సెర్చ్ చేశారు. అదేవిధంగా ఇండియాలో తనకు ఎలాంటి పాపులారిటీ ఉందని తెలుసుకోవడం కోసమే ప్రతి ఒక్క కార్యక్రమానికి తనతో పాటు హాజరవుతున్నారని అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదంటూ ఈమె మూడో పెళ్లి గురించి వచ్చినటువంటి వార్తలను కొట్టి పారేశారు.

Actress Jayasudha: రెండో పెళ్లికి సిద్ధమైన నటి జయసుధ… ఆరు పదుల వయసులో అవసరమా అంటున్న నెటిజన్స్!

Actress Jayasudha: పెళ్లి విషయంలో ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు చాలా విభిన్నంగా ఆలోచిస్తున్నారు పెళ్లికి వయసుతో సంబంధం లేదని పెళ్లి చేసుకోవడానికి మనం మనసు పడిన వ్యక్తి మన మనసును అర్థం చేసుకున్న వ్యక్తి దొరికితే చాలు వయసుతో సంబంధం లేదని చాలామంది నటీనటులు లేటు వయసులో ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది కొన్ని కారణాలవల్ల ఒంటరి జీవితాన్ని గడుపుతూ లేటు వయసులో వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా జయసుధ కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందంటూ వార్తలు వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలు క్రితం తన భర్త చనిపోవడంతో ఈమె ఒంటరిగా ఉండలేక రెండో పెళ్లికి సిద్ధమైందని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇలా జయసుధ ఆరుపదుల వయసులో రెండో పెళ్లికి సిద్ధమైందని ఇప్పటికే ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఈ వయసులో రెండో పెళ్లి అవసరమా అంటూ పలువురు నెటిజెన్స్ జయసుధ పట్ల విమర్శలు కూడా చేశారు. తన రెండవ పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై జయసుధ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

Actress Jayasudha: అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే..

ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే కొందరు నాపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాను తన సెకండ్ ఇన్నింగ్స్ సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇలా సినిమాలతో బిజీగా ఉంటే తనకు ఒంటరితనం అనే ఫీలింగ్ ఏ మాత్రం కలగదని తన రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలను కొట్టి పారేశారు.

Jayasudha : ఒకే ఏడాదిలో 25 సినిమాలు.. అందుకే ఆమె సహజ నటి అయింది.!

Jayasudha : సినిమా ఇండస్ట్రీలో నేచురల్ పర్ఫార్మర్ అనిపించుకోవడం అంత ఈజీ కాదు. అది హీరో అయినా హీరోయిన్ అయినా. ఎందుకంటే ఎక్కువశాతం ఇక్కడ కమర్షియల్ చిత్రాలే రూపొందుతుంటాయి. హీరోలు దాదాపుగా అందరు కమర్షియల్ హీరో అనిపించుకునేందుకు ప్రయత్నిస్తే హీరోయిన్స్ మాత్రం గ్లామర్ క్వీన్ అనిపించుకోవడానికి ఆరాటపడుతుంటారు. భానుమతి, సావిత్రి, జమున లాంటి హీరోయిన్స్ వారి తరంలో కథకు మాత్రమే ప్రాధాన్యమిచ్చేవారు. ఆకాలంలో ఎక్కువగా జానపదం, పౌరాణిక చిత్రాలే ఎక్కువగా రూపొందాయి.

ఆ తర్వాత శ్రీదేవి, జనరేషన్‌లో విజయశాంతి, రాధ, సుహాసిని, మాధవి, రాధిక లాంటి వారు హీరోయిన్స్‌గా ఓ వెలుగు వెలిగారు. వీరంతా ఎక్కువగా గ్లామర్ పాత్రలనే చేయడానికి ఆసక్తి చూపించారు. ఎందుకంటే అప్పుడు చిరంజీవి, సుమన్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు, నాగేశ్వర రావు లాంటి వారు ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేసేవారు. వారి పక్కన ఈ హీరోయిన్స్ అందరూ కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలతో పాటు గ్లామర్ పాత్రలపైనా ఫోకs పెట్టారు.

అయితే వీరిలో గ్లామర్ రోల్స్ చాలా తక్కువ చేసింది మాత్రం జయసుధనే. ఆమె ఏ హీరో పక్కన నటించిన గ్లామర్ పాత్రలు కాకుండా కథా బలమున్న చిత్రాలను ఎంచుకున్నారు. ఇక ఇంతమంది గ్లామర్ హీరోయిన్స్ మధ్య తన అద్భుతమైన నటనతో సహజ నటి అని విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. స్క్రీన్ మీద జయసుధ పాత్ర కనిపిస్తే ప్రేక్షకులు చాలా ఎమొషనల్ అయ్యేవారు. అగ్ర దర్శకులకు బెస్ట్ ఛాయిస్‌గా జయసుధ నిలిచారు. అసలు పేరు సుజాత అయితే సినిమా రంగానికి జయసుధగా పరిచయమయ్యారు.

నటి, నిర్మాత విజయనిర్మల జయసుధకు మేనత్త అవుతారు. 1972 లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం సినిమా ద్వారా జయసుధ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆమె 300లకు పైగా సినిమాల్లో నటించగా వాటిలో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి. ఇక దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో దాదాపు 25 సినిమాలు, దర్శక రత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించి అగ్ర స్థానంలో నిలిచారు. అంతేకాదు జయసుధ నటించిన సినిమాలు 25 ఒకే సంవత్సరంలో విడుదలవడం ఇప్పటికీ గొప్ప విశేషంగా చెప్పుకంటారు. ఇక జయసుధను అందరూ నిర్మాతల హీరోయిన్ అని చెప్పుకుంటుంటారు. రెమ్యునరేషన్ పరంగా ఎప్పుడూ నిర్మాతలను ఇబ్బంది పెట్టని నటి అని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటుంటారు.

జయసుధకు ఏమైంది.. ఇలా ఎందుకు మారింది.. ఫోటో వైరల్..

సినీ పరిశ్రమలో జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు సహజనటిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆమె అసలు పేరు సుజాత. ఆమె మద్రాసులో జన్మించినా.. ఆమె మాతృభాష తెలుగే అని చెప్పుకుట్టుంది. పండంటి కాపురం సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ నటి.. తెలుగు, తమిళం, కన్నడం, మళయాలం భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. దాదాపు 300 కు పైగా సినిమాల్లో నటించారు.

1985లో ఆమె నితిన్ కపూర్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మొదటి కొడుకు పేరు నిహార్, రెండో కుమారుడు పేరు శ్రేయంత్ ఉన్నారు. ఇటీవల అనారోగ్యముతో బాధపడుతూ వైద్య సహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి ఈమె ఒక ట్రస్టును కూడా ప్రారంభించారు. 2009 లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాదు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.అయితే ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆమె ఫొటో ఒకటి వైరల్ గా మారింది.

దానిని చూసిన ప్రతీ ఒక్కరూ జయసుధ ఎంటి ఇలా మారారు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈమె ఇండియాలో లేరు. అమెరికాలో ఉన్నారు. అక్కడే కొన్ని రోజులుగా ఉంటున్నారు. ఒకప్పుడు వరస సినిమాలో బిజీగా ఉండే ఈమె.. కొన్ని నెలలుగా ఎందుకో సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.

అయితే ఇటీవల ఆమె కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నిహార్ కపూర్ గ్యాంగ్‌స్టర్ గంగరాజు అనే సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఒకప్పుడు ఎంతో గ్లామరస్ గా కనిపించిన ఆమె ప్రస్తుతం ఇలా మారడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

వేశ్య పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే!

సాధారణంగా వేశ్య అనే పేరుకు సమాజంలో ఎలాంటి గౌరవం ఉంటుందో మనకు తెలిసిందే. అలాంటి వారి పట్ల చాలామంది అమర్యాదగా, అగౌరవంగా మాట్లాడుతుంటారు. కానీ చాలా సినిమాలలో మనము ఇలాంటి వేశ్య పాత్రలను చూస్తూ ఉంటాము. ఇలాంటి పాత్రలో నటించడానికి సాధారణ ఆర్టిస్టుల మాత్రమే ముందుకు వచ్చేవారు. ఇక స్టార్ హీరోయిన్స్ అయితే ఇలాంటి సినిమాలు చేయడానికి అసలు సాహసం చేయరు.ఇలాంటి పాత్రలో చేస్తే ఎక్కడ వారి కెరియర్ పై దెబ్బ పడుతుందో అని చాలామంది ఇలాంటి పాత్రలను చేయడానికి వెనకడుగు వేస్తారు. కానీ ఇలాంటి పాత్రలలో చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి అని చెప్పవచ్చు. మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఇలాంటి ధైర్యం చేసి వేశ్య పాత్రలలో నటించారు. మరి వేశ్య పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ స్టార్ హీరోయిన్స్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం…

1) అనుష్క: అందం అభినయం కేరాఫ్ అడ్రస్ అంటే అనుష్క అని చెప్పవచ్చు.తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న అనుష్క వేదం సినిమాలో వేశ్య పాత్రలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు.

2) ఛార్మి: ప్రేమ ఒక మైకం, జ్యోతిలక్ష్మి వంటి సినిమాలలో చార్మి వేశ్య పాత్ర ద్వారా సందడి చేశారు.

3) శ్రీయ: శ్రియ వేశ్యగా పవిత్ర సినిమాలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.

4) జయప్రద: మేఘసందేశం చిత్రంలో అలనాటి తార జయప్రద వేశ్య పాత్ర ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

6) జయసుధ: ఏఎన్నార్ హీరోగా తెరకెక్కిన ప్రేమాభిషేకం సినిమాలో జయసుధ వేశ్యగా నటించారు.

7) శృతిహాసన్: శృతిహాసన్ వేశ్యగా డీ డే (గెలుపు గోపురం) అనే సినిమాలో వేశ్యగా సందడి చేశారు.

8) స్నేహ: హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న స్నేహ దూల్ పేట చిత్రంలో వేశ్య పాత్రలో అభిమానులను మెప్పించారు.

జయసుధ మొదటి పెళ్లి ఫోటోలు చూసారా..? ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే కన్నీళ్లే

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ లో హీరోలకు ఎంత క్రేజ్ ఉండేదో హీరోయిన్లకు కూడా అంతే క్రేజ్ ఉండేది. అప్పుడు వచ్చిన సినిమాల్లో హీరో పాత్రకు ధీటుగా హీరోయిన్ పాత్రలు ఉండేవి ఉదాహరణకి సినిమాలో హీరో పోలీస్ అయితే హీరోయిన్ లాయర్ అయ్యుండేది అలాంటి ఇంపార్టెంట్ రోల్ లో హీరోయిన్స్ నటిస్తూ ఉండేవారు. అప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించిన వారిలో సావిత్రి గారు, జమున,వాణిశ్రీ, జయప్రద, జయసుధ, శ్రీదేవి లాంటివారు ఉన్నారు. వీళ్ళందరూ టాప్ హీరోయిన్స్ అయినప్పటికీ అందులో జయసుధ గారు అందరి హీరోల పక్కన నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.

జయసుధ గారికి మగాళ్ళలో ఆడవాళ్ళలో చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు. అడవి రాముడు సినిమాలో ఎన్టీఆర్ పక్కన ఒక మంచి ఇంపార్టెంట్ పాత్రలో నటించి తనదైన గుర్తింపును సాధించింది. అయితే ఇండస్ట్రీ హీరోగా ఉన్న వడ్డే నవీన్ జయసుధ గారి కొడుకు అని రూమర్లు బాగానే వచ్చాయి. కానీ వడ్డీ నవీన్ వాళ్ళ నాన్న అయిన వడ్డె రమేష్ వాళ్ల బామ్మర్ది అయిన రాజేంద్ర ప్రసాద్ గారిని జయసుధ పెళ్లి చేసుకున్నారు అంటే ఈ లెక్కన వడ్డె రమేష్ గారికి ఆవిడ చెల్లెలు అవుతుంది.

అయితే రాజేంద్రప్రసాద్ ఒక బిజినెస్ మ్యాన్ జయసుధ రాజేంద్రప్రసాద్ లవ్ చేసుకున్నారు ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్తే వాళ్లు కాదనడంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చేసేదేంలేక ఇంట్లో వాళ్ళు పిలిచి రిసెప్షన్ పెట్టారు. అయితే ఈ పార్టీకి ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ప్రముఖులు వచ్చారు వారిలో దాసరి నారాయణరావు గారు మురళి మోహన్ గారు లాంటి వారు వచ్చారు. చాలామంది జయసుధ గారి ఫ్యాన్స్ కూడా ఈ పెళ్లిని చూడ్డానికి వచ్చారు పెళ్ళయిన కొన్ని రోజులకే జయసుధ మళ్లీ సినిమాల్లో నటించింది. రాజేంద్రప్రసాద్ తన బిజినెస్ లు తను చూసుకుంటూ ఉండేవాడు అలాగే రోజు జయసుధ ని టార్చర్ పెట్టేవాడట దీంతో విసిగిపోయిన జయసుధ విజయవాడ నుంచి చెన్నై వెళ్లి విజయ వాహిని స్టూడియో అధినేత అయిన నాగిరెడ్డి గారిని కలిసి జరిగిన విషయం అంతా చెప్పింది.

దీంతో నాగిరెడ్డి ఇండస్ట్రీలో ప్రముఖులైన దాసరి నారాయణరావు లాంటి వారిని పిలిచి అందరి ముందు రాజేంద్ర ప్రసాద్ తో మాట్లాడితే తను చాలా అమాయకంగా ఏమీ తెలియదు అన్నట్టుగా మాట్లాడాడు దాంతో జయసుధ నాకు నువ్వు అవసరంలేదు అని చెప్పేసి ఇద్దరు విడిపోయారు చాలా రోజుల పాటు జయసుధ విజయ వాహినీ స్టూడియో లోనే ఉంది దాని తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. అలా సినిమాలు చేస్తున్న సమయంలో నితిన్ కపూర్ తో పరిచయం ఏర్పడడం వలన ఆయన్ని పెళ్లి చేసుకుంది. తర్వాత కూడా చాలా సినిమాల్లో నటిస్తూ హీరోలకి తల్లి పాత్రలు చేస్తూ వచ్చారు.

అలా ఆవిడ చేసిన పాత్రల్లో రవితేజ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో ఆమె నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆమె హీరోలకు తల్లి పాత్రలు చేశారు. ముఖ్యంగా దిల్ రాజు బ్యానర్ లో భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా లో సిద్ధార్థ తల్లిగా నటించి మంచి మార్కులు కొట్టేశారు. అయితే సినిమా ఇండస్ట్రీలో మొదటి పెళ్లి చేసుకొని వాళ్ల భర్తలు మంచివారు కాకపోవడంతో విడాకులు తీసుకున్న హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. కానీ జయసుధ గారు లవ్ చేసి పెళ్లి చేసుకున్న తన భర్త అయిన రాజేంద్ర ప్రసాద్ అలా టార్చర్ పెట్టి తనను విసిగించడం వేధించడం చేయడం అనేది సరైనది కాదు కాబట్టి జయసుధ గారు అతన్ని వదిలించుకొని మంచి నిర్ణయం తీసుకున్నారు అని రాజేంద్ర ప్రసాద్ గారి గురించి తెలిసిన చాలా మంది అంటుంటారు