Actress Jayasudha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జయసుధ అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఈమె సీనియర్ హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్నార్ నుంచి చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోల సరసన కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే గత కొద్దిరోజులుగా జయసుధ మూడో పెళ్లి చేసుకుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈమె ఏ కార్యక్రమానికి వెళ్లిన ఈమె పక్కనే ఒక వ్యక్తి కనిపించడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.ఇలా జయసుధ రహస్యంగా మూడో వివాహం చేసుకున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇక తాజాగా ఈమె హీరో విజయ్ నటించిన వారసుడు సినిమాలో కూడా నటించారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా ఆ వ్యక్తి జయసుధ పక్కనే ఉండడం గమనార్హం. ఇలా ఏ కార్యక్రమానికి వెళ్లిన తను జయసుధ వెంట ఉండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.అయితే తాజాగా జయసుధ తన మూడో పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించి ఆ వ్యక్తి ఎవరు తనకు ఆ వ్యక్తికి సంబంధం ఏంటి అనే విషయాలను తెలియచేశారు.
ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ ప్రతి కార్యక్రమంలోనూ తన పక్కనే ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరు పెలిపే.తాను అమెరికాలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారని అయితే ఆయన తనకు మంచి స్నేహితుడిని జయసుధ తెలిపారు.ఆయన తన బయోపిక్ చిత్రం చేయాలని భావిస్తున్నారు అందుకే తన గురించి ఇంటర్నెట్ మొత్తం సెర్చ్ చేశారు. అదేవిధంగా ఇండియాలో తనకు ఎలాంటి పాపులారిటీ ఉందని తెలుసుకోవడం కోసమే ప్రతి ఒక్క కార్యక్రమానికి తనతో పాటు హాజరవుతున్నారని అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదంటూ ఈమె మూడో పెళ్లి గురించి వచ్చినటువంటి వార్తలను కొట్టి పారేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…