Waltair Veerayya: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ నేడు చిత్ర పరిశ్రమకే ఎంతో గర్వకారణమైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. మెగాస్టార్ అనే బిరుదును సంపాదించుకున్న ఈయనకు ఈ బిరుదు ఆషామాషీగా రాలేదు. ఈ బిరుదు వెనుక ఎంతో కష్టం కృషి ఉన్నాయని చెప్పాలి.
ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా మారిన చిరంజీవి ఎప్పటికప్పుడు నటనలో మార్పులు చేసుకుంటూ ప్రేక్షకులకు కావలసినటువంటి వినోదాన్ని అందించారు.ఇలా నటుడిగా ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని మెలుగుతున్నటువంటి చిరంజీవి అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నారు. చిరంజీవి సినిమా వస్తుందంటే ఇక థియేటర్ మొత్తం దద్దరిల్లి పోవాల్సిందే.
ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆగ్ర హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందిన ఈయన రాజకీయాలలోకి వెళ్లారు. ఇక రాజకీయాలలో కొత్త కాలం పాటు ఉన్నటువంటి చిరంజీవి తిరిగి ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.అనంతరం సైరా నరసింహారెడ్డి ఆచార్య గాడ్ ఫాదర్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలలో చిరంజీవి తన మార్క్ కనిపించిన ప్రేక్షకులలో ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్ అనేది ఉంది.
ఇక ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా వచ్చారు. అయితే ఈ సినిమాలో మాత్రం ప్రేక్షకులకు కావలసినటువంటి ఫుల్ మాస్ మసాలా ఎంటర్టైనర్ అందించారనే చెప్పాలి.ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో దృష్టిలో ఉంచుకున్నటువంటి డైరెక్టర్ ప్రేక్షకులకు కావలసినది వారి ముందుకు తీసుకువచ్చారు.గత సినిమాలలో చిరంజీవి మాస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉండేదో అదే విధంగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకులకు చూపించడంతో ప్రేక్షకులు మాత్రం బాస్ ఇస్ బ్యాక్ అంటూ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈయన దాదాపు 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇప్పటికి అదే క్రేజ్ సొంతం చేసుకున్నారని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…