Tag Archives: amitabh bachachan

Suryavamsam Movie : ఒకే టైటిల్ తో వచ్చిన ఈ సినిమాలలో ఒక హీరో మాత్రమే ఉత్తమ నటుడు అవార్డు అందుకోలేకపోయారు.!!

Suryavamsam Movie : మామూలుగా సినీ ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు వస్తూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఒక భాషలో వచ్చి మంచి విజయం సాధించిన సినిమాలను వేరొక భాషలోకి ఇతర దర్శకులు కథలో కొన్ని మార్పులు చేసి తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకుంటూ వుంటారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన రీమేక్ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఇలా రీమేక్ సినిమాల ట్రెండ్ కొనసాగడం ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో చిత్ర పరిశ్రమలో రీమేక్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. తెలుగు సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడం లేదా ఇతర భాషల్లో సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ ఉంటారు.

అయితే ఇలా రీమేక్ చేసిన సినిమాల్లో ఒకటి సూర్యవంశం. వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసిన “సూర్యవంశం” సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ సృష్టించింది. ఇక ఈ సూర్యవంశం సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు వెంకటేష్ ను ఎంతగానో దగ్గర చేసింది. ఓవైపు తండ్రి పాత్రలో మరో వైపు కొడుకు పాత్రలో అందరికీ ఆదర్శంగా నిలిచే లా వెంకటేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు వెంకటేష్. అదే సమయంలో ఊరు నుంచి వెలివేయబడిన వెంకటేష్ ఎలాంటి చదువు లేకున్న భార్య ప్రోత్సాహంతో పెద్ద బిజినెస్ మేన్ గా ఎలా ఎదిగాడు సినిమాలో చూపిస్తూ ఉంటారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు అంటూ నిరూపిస్తాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ పండించడంలో వెంకటేష్ కి ఎవరూ సాటిలేరు అనే చెప్పాలి.

కాగా ఈ ‘సూర్యవంశం’ సినిమా తమిళ రీమేక్. తమిళంలో కూడా ఈ సినిమాకు ‘సూర్య వంశం” అనే టైటిల్ పెట్టారు.. నిర్మాత RB.చౌదరి తమిళంలో “పూవేఉనక్క”అనే చిత్రాన్ని తీసి గొప్ప విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత తాను తీయబోయే మరొక చిత్రానికి విక్రమన్ ని దర్శకత్వం చేయాలని ఆయన కోరారు. ఈసారి విక్రమన్ అన్నదమ్ముల కథ తో వచ్చి “వాన తైపోలా” చిత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత మరొక కథ రాసుకొని సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరికి వినిపించారు. శరత్ కుమార్ హీరోగా ఇద్దరు కవలలుగా ఓ కథ రాయమని విక్రమన్ ని కోరారు. కానీ ఆయన దానికి అంగీకరించలేదు. అనేక వాదనల తర్వాత చివరికి ఆర్.బి.చౌదరి విక్రమన్ రాసిన కథను అసంతృప్తితో అంగీకరించారు.

సూపర్ గుడ్ ఫిలింస్, ఆర్.బి.చౌదరి నిర్మాణం విక్రమన్ దర్శకత్వంలో “సూర్యవంశం” తమిళ చిత్రం 1997 జూన్ 27న విడుదల అయ్యింది. ఎస్ ఏ రాజ్ కుమార్ అందించిన పాటలు తమిళనాట ప్రేక్షకాదరణ పొందాయి. అలా సినిమా బాగుండడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో శరత్ కుమార్ నటనకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ నటుడు అవార్డుతో సత్కరించింది. 1998లో తెలుగు “సూర్య వంశం” సినిమా ఘన విజయం సాధించడంతో.. ఇదే చిత్రాన్ని పద్మాలయా స్టూడియోస్ బ్యానర్, ఆదిశేషగిరిరావు నిర్మాణం, ఇవివి.సత్యనారాయణ దర్శకత్వంలో “సూర్యవంశం” అనే హిందీ చిత్రం 1999 మే 21న విడుదలయ్యింది.

ఈ సినిమాలో అమితాబచ్చన్ ద్విపాత్రాభినయంలో కనిపించారు. ఆయన పక్కన జయసుధ, సౌందర్య జోడిగా కనిపించారు. అను మాలిక్ సంగీతాన్ని అందించారు. కుతుబ్ షాహీ టూంబ్స్, రాజస్థాన్, శ్రీలంక లోని మూడు లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. అమితాబచ్చన్ తో అనేక చిత్రాల్లో నటించిన రేఖ ఈ సినిమాలో కనిపించనప్పటికీ జయసుధ, సౌందర్యలకి వాయిస్ డబ్బింగ్ చెప్పారు. ద్విపాత్రాభినయంతో అమితాబచ్చన్ మెప్పించడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించింది. తమిళంలో శరత్ కుమార్ కి, హిందీలో అమితాబచ్చన్ కి ఉత్తమ నటుడు అవార్డు పొందారు. తెలుగులో నటించిన వెంకటేష్ కు మాత్రం ఉత్తమనటుడు అవార్డు రాకపోవడం గమనార్హం.

బిగ్ బీ షోలో కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో జాన్ అబ్రహం.. కారణం..?

జనరల్ నాలెడ్జ్ రూపంలో ఒక రియాల్టీ షోగా మన ముందుకు వస్తున్నది కేబీసీ (కౌన్ బనేగా కరోడ్‌పతి). దీనికి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తన్న విషయం తెలిసిందే. ఈ షో ద్వారా రూ.కోటి గెలుచుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఈ షోకి హిందీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉంది. ఈ షో వస్తుందంటే చాలు.. టీవీల ముందు వాలిపోతారు.

తెలుగులో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కూడా దాని నుంచి స్పూర్తి పొందిందే. కంటెస్టంట్ల విషయంలో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్స్‌ కాకుండా వాళ్ల జీవితాల్లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలను అందరికీ పరిచయం చేస్తూ ఈ షో ముందుకు నడిపిస్తున్నారు. అప్పుడప్పుడు జోక్స్ కూడా వేస్తుంటారు అబితాబ్. సెలెబ్రిటీలు కూడా అప్పుడప్పుడు మెరుస్తుంటారు.

తాజాగా ఈ షోకి యాక్షన్‌ హీరో జాన్‌ అబ్రహం హాజరయ్యాడు. అతడి తాజా చిత్రం సత్యమేవ జయతే 2 ప్రమోషన్లో భాగంగా హీరోయిన్‌ దివ్యా ఖోస్లా కుమార్‌తో కలిసి షోలో పాల్గొన్నాడు. తాజాగా దీనికి సంబంధించి ప్రోమో విడుదల చేశారు. కొన్ని విషయాలను పంచుకున్నారు. అతడి వేలిపై ఫుట్ బాల్ ను తిప్పి ఆకట్టుకున్నాడు. ఇదే ప్రయత్నం బిగ్‌ బీ చేయగా ఫెయిల్‌ అయ్యాడు. తన సిక్స్ ప్యాక్ కూడా చూపించాడు. ఇక తన ధూమ్ సినిమాకు సంబంధించి విషయాలను గుర్తు చేసుకున్నారు.

ధూమ్ సినిమా రిలీజ్ రోజున తాను మీ దగ్గరకు బైక్ పై వచ్చాను.. అప్పుడు మీరు ఈ విషయంలో అభిషేక్ ను ప్రోత్సహించొద్దు అని అన్నారు.. తర్వాత అభిషేక్ కిందకు రాగానే ‘వావ్ బైక్ బాగుంది’ అంటూ తనతో మాట మార్చారు అని గుర్తు చేశారు. దానికి అబితాబ్ నవ్వాడు. తర్వాత ఏ విషయం గురించో ఈషోలో మాట్లాడి.. కన్నీరు పెట్టుకున్నాడు జాన్‌. దానికి గ్యాలరీలో ఉన్న వాళ్లు కూడా బాధపడ్డారు. అయితే జాన్ ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

బిగ్ బీ పై సల్మాన్ ఖాన్ తండ్రి సంచలన కామెంట్స్.. ఆ పని చేయండి అంటూ..

అమితాబ్ బచ్చన్ పేరు తెలియని భారతీయుడు ఉండరు. బాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసిన అమితాబ్ బచ్చన్ ఎన్నో సినిమాలల్లో నటించాడు. అమితాబచ్చన్‌తో భారతీయుల అనుబంధం ఈనాటిది కాదు. 1969లో ‘సాత్ హిందుస్థానీ’ తో మొదలైన ఆయన నట ప్రస్థానం ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ వరకు కొనసాగుతూనే ఉంది.

ఇటీవల అతడు 79వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అతడికి పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందులో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఇక అతడి అభిమానులు అయితే సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. యాష్ అబితాబ్ బచ్చన్ బర్త్ డేతో ట్రెండింగ్ లో దూసుకుపోయింది.

ఇంత వయస్సులో కూడా అతడు ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అందుకే అబితాబ్ బచ్చన్ ప్రతీ ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఈ నేపథ్యంలో అబితాబ్ కు కొంతమంది ఫోన్ చేసి కూడా బర్త్ డే విష్ చేశారు. ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్ తండ్రి.. ప్రముఖ రచయిత సలీం ఖాన్ కూడా అతడిని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

దాంతో పాటు అబితాబ్ బచ్చన్ ను .. అతడి జీవితంలో కొత్త ఇన్నింగ్స్ లో మంచి జరగాలని.. సినిమాలకు రిటైర్ మెంట్ తీసుకోవాలని ఆయన కోరాడు. తన వయస్సును దృష్టిలో ఉంచుకొని రెస్ట్ తీసుకుంటే మంచిదనే ఉద్దేశ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. అమితాబ్ బచ్చన్ ఇప్పుడు పదవీ విరమణ చేయాలి అని సూచించారు. అతడు ఎన్నో సాధించాడని.. వ్యక్తిగతంగా కూడా అతడు కొన్ని సంవత్సరాలు గడపాలని.. వృత్తిపరంగా అతడు విజయం సాధించాడని.. ఇక పదవీ విరమణ బిగ్ బీకి ఎంతో అవసరం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

అబితాబ్ కు నాటో లేఖ.. అందులో ఏముందో తెలుసా..

భారతదేశంలో ప్రస్తతం సినీ దిగ్గజం అని అబితాబ్ బచ్చన్ ను పిలుస్తాం. అయితే అతడికి నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ సంచలన లేఖను రాసింది. అదేంటో తెలుసా.. పాన్ మాసాలాను ప్రచారం చేసే వాణిజ్య ప్రకటన నుంచి వైదొలగాలని లేఖలో పేర్కొంది. ఎందుకంటే.. పాన్ మసాలాలో ఊపిరితిత్తులకు హానికరమైన పొగాకు ఉంటుందని.. ఇది ప్రజలకు అలవాటు అయితే.. దానికే వ్యసనంగా మారుతారని.. దీని వల్ల వాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపింది.

ప్రజలకు ఉపయోగపడే ప్రకటనలు చేయాలని.. ప్రజల ఆరోగ్యం చెడిపోయే ప్రకటలను చేయవద్దని సూచించింది. దీనికి సంబంధించి నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ లేఖ రాశారు. ఎన్నో మంచి కార్యక్రమాలకు ప్రకటనలు ఇస్తున్న అమితాబ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటూ విన్నవించింది.

అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిదే. అలాంటి వ్యక్తి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసే పాన్ మసాలా యాడ్ లో నటించడం సరికాదని కూడా లేఖలో శేఖర్ సల్కర్ అన్నారు. సెలబ్రిటీలు ఏం చేసినా చాలామంది వాటిని నమ్ముతారని.. ఇటువంటి వాటిని ప్రోత్సహించడం సరికాదని లేఖలో పేర్కొన్నాడు.

పాన్, గుట్కా వంటివి క్యాన్సర్ కు కారకాలుగా ఉంటాయి.. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. పాన్ మసాల క్యాన్సర్ కారకంగా పని చేస్తోందనే విషయం పరిశోధనల్లో తేలిందని… అందులోని పదార్ధాలు నోటి క్యాన్సర్ కు దారి తీస్తాయని పేర్కొన్నారు. అయితే లేఖ రాసిన అతడికి అబితాబ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

అందంగా ఉన్నారు కదండీ.. సినిమాల్లోకి రావచ్చుగా.. బిగ్ బి మనవరాలికి ఆఫర్స్!

బాలీవుడ్ బిగ్ బీ, మెగాస్టార్ గా ఎంతో పేరు సంపాదించుకున్న అమితాబచ్చన్ కుటుంబానికి ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఐశ్వర్య అభిషేక్ నటనను వారసత్వంగా పుచ్చుకొని తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే బిగ్ మీ మనవరాలు నవ్య నవేలి నంద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అమితాబచ్చన్ దంపతుల పెద్ద కుమార్తె శ్వేతా బచ్చన్ గారాలపట్టి నవ్య నవేలి. వృత్తిపరంగా శ్వేతా బచ్చన్ మోడల్ తన భర్త నిఖిల్ నంద ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. ఇక నవ్య చదువుపై శ్రద్ధ కనబరుస్తూ లండన్ లోని సేవినొక్స్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పొందారు. చూడటానికి ఎంతో అందం అభినయంతో ఉన్న నవ్యకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

ఈమె అందం హీరోయిన్ కు ఏమాత్రం తగ్గదని చెప్పవచ్చు.సోషల్ మీడియా వేదికగా ఎంతో చురుకుగా ఉండే నవ్య తరచు తనకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే సదరు నెటిజన్లు ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని భావించినప్పటికీ తనకు సినిమాల్లో పెద్దగా ఆసక్తిలేదని తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు.

తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన నవ్వకు సదరు నెటిజన్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఎంతో అందంగా ఉన్నారు కదా సినిమాలలోకి రావచ్చుగా అంటూ.. సదరు నెటిజన్ ప్రశ్నించడంతో అందుకు నవ్య తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే నవ్య మాట్లాడుతూ.. అందమైన స్త్రీలు వ్యాపార రంగంలో రాణిస్తారు అంటూ సదరు నెటిజన్ కు కౌంటర్ ఇచ్చింది.ఈ క్రమంలోనే తనకు నటనపై ఆసక్తి లేకపోవడంతో తన తండ్రి బాటలోనే వ్యాపార రంగంలో రాణించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.