భారతదేశంలో ప్రస్తతం సినీ దిగ్గజం అని అబితాబ్ బచ్చన్ ను పిలుస్తాం. అయితే అతడికి నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ సంచలన లేఖను రాసింది. అదేంటో తెలుసా.. పాన్ మాసాలాను ప్రచారం చేసే వాణిజ్య ప్రకటన నుంచి వైదొలగాలని లేఖలో పేర్కొంది. ఎందుకంటే.. పాన్ మసాలాలో ఊపిరితిత్తులకు హానికరమైన పొగాకు ఉంటుందని.. ఇది ప్రజలకు అలవాటు అయితే.. దానికే వ్యసనంగా మారుతారని.. దీని వల్ల వాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపింది.
ప్రజలకు ఉపయోగపడే ప్రకటనలు చేయాలని.. ప్రజల ఆరోగ్యం చెడిపోయే ప్రకటలను చేయవద్దని సూచించింది. దీనికి సంబంధించి నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ లేఖ రాశారు. ఎన్నో మంచి కార్యక్రమాలకు ప్రకటనలు ఇస్తున్న అమితాబ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటూ విన్నవించింది.
అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిదే. అలాంటి వ్యక్తి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసే పాన్ మసాలా యాడ్ లో నటించడం సరికాదని కూడా లేఖలో శేఖర్ సల్కర్ అన్నారు. సెలబ్రిటీలు ఏం చేసినా చాలామంది వాటిని నమ్ముతారని.. ఇటువంటి వాటిని ప్రోత్సహించడం సరికాదని లేఖలో పేర్కొన్నాడు.
పాన్, గుట్కా వంటివి క్యాన్సర్ కు కారకాలుగా ఉంటాయి.. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. పాన్ మసాల క్యాన్సర్ కారకంగా పని చేస్తోందనే విషయం పరిశోధనల్లో తేలిందని… అందులోని పదార్ధాలు నోటి క్యాన్సర్ కు దారి తీస్తాయని పేర్కొన్నారు. అయితే లేఖ రాసిన అతడికి అబితాబ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…