Tag Archives: andhra pradesh

పేదలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఇళ్ల పట్టాల పంపిణీ ఎప్పుడంటే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని ఇళ్లు లేని పేద ప్రజలకు శుభవార్త చెప్పింది. పేద ప్రజలు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది. డిసెంబర్ నెల 25వ తేదీన రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అనేకసార్లు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడగా ఈసారి ఖచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

కోర్టులో ఇళ్ల పట్టాల పంపిణీ గురించి పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ప్రభుత్వం కోర్టు స్టే ఉన్న ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. జగన్ ఈ సమావేశంలో లబ్ధిదారులకు డి ఫామ్ పట్టా ఇచ్చి ఇళ్లస్థలాలను కేటాయించాలని చెప్పారు. రాష్ట్రంలో పట్టాలు ఇచ్చిన రోజే ఇళ్ల నిర్మాణం కూడా మొదలు కానుంది.

ప్రభుత్వం దాదాపు 30 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనుండగా తొలి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. జగన్ సర్కార్ మొదట మార్చి 25వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ అమలు చేయాలని భావించింది. అయితే అప్పుడు స్థానిక సంస్థల నోటిఫికేషన్ వల్ల ఎన్నికల కోడ్ అమలు కావడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఆ తరువాత అంబేద్కర్ జయంతి, వైఎస్సార్ జయంతి, స్వాతంత్ర దినోత్సం, గాంధీ జయంతి సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది.

ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు ప్రశంసిస్తున్నారు. జగన్ సర్కార్ సొంతింటి కలను నెరవేర్చే దిశగా అడుగులు వేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో కోర్టు తుది తీర్పుకు అనుగుణంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది.

ఏపీ నిరుద్యోగులకు మరో శుభవార్త.. భారీ నోటిఫికేషన్ విడుదల…?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ గత కొన్ని నెలల నుంచి నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జగన్ సర్కార్ గ్రామ, వార్డ్ సచివాలయాల ఉద్యోగాలు మరియు గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాల ద్వారా నిరుద్యోగులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూర్చింది. తాజాగా జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో అటవీ శాఖలో పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ జరగనుంది.

రాష్ట్ర అటవీ శాఖ అధికారి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. త్వరలో అటవీ శాఖ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుందని కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 40 శాతం సిబ్బంది కొరత ఉండగా ఈ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు అటవీ శాఖ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 23 శాతం అడవులు ఉండగా అడవుల విస్తీర్ణం మరింత పెంచే దిశగా అటవీశాఖ అడుగులు వేస్తోంది.

జాతీయ అటవీ విధానం ప్రకాతం అటవీ అడవుల విస్తీర్ణం పెంచేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీ జరగాల్సి ఉండగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల అంతకంతకూ ఆలస్యమవుతూ వస్తోంది. అటవీశాఖ ప్రస్తుతం 540 ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఉద్యోగాల భర్తీ అనంతరం మరో 1,000 ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఏపీపీఎస్సీ 1000 ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేయనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. కరోనా వైరస్ విజృంభణ తగ్గిన నేపథ్యంలో వరుసగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతూ ఉండటం గమనార్హం.

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఏపీలో ఆ ఖైదీలంతా విడుదల..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జైలు శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాల జైలు శిక్ష పూర్తైన మహిళా ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించారు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మహిళా ఖైదీలు, వాళ్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల పాలనకు భిన్నంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.

నిన్న ఏపీ హోం మంత్రి సుచరిత మీడియాలో మాట్లాడుతూ మహిళా ఖైదీల విడుదల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయమని.. దేశ చరిత్రలోనే గతంలో ఎవరూ తీసుకోని నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని చెప్పారు. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 55 మంది మహిళా ఖైదీలు విడుదల కానున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 147 మంది మహిళా ఖైదీలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

పోలీసులు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వివిధ వృత్తులపై శిక్షణ ఇచ్చారు. ఖైదీలు జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వారి కాళ్లపై వారు నిలిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ఇంతమంది మహిళా ఖైదీల విడుదల జరుగుతోందని వెల్లడించారు. విడుదలైన ఖైదీలు కుటుంబాలతో సంతోషకరమైన జీవనం సాగిస్తాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

నేరాల్లో మహిళల పాత్ర గురించి కూడా విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. చాలామంది క్షణికావేశంలో నేరాలు చేసి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాబొయే ఏడు రోజుల్లో మహిళా ఖైదీల విడుదల జరగనుందని చెప్పారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు అలర్ట్.. పాటించాల్సిన మార్గదర్శకాలివే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాసంస్థల పునఃప్రారంభం దిశగా చర్యలు చేపట్టింది. స్కూళ్లు, కాలేజీలకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి వేర్వేరు అకడమిక్‌ క్యాలెండర్లు విడుదలయ్యాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ నెలలో క్లాసులు ప్రారంభమయ్యేవి. అయితే ఈ విద్యా సంవత్సరంలో 5 నెలల సమయం కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల వృథా అయింది.

దీంతో నష్టపోయిన పనిదినాలను సర్దుబాటు చేస్తూ నేటి నుంచి తరగతుల నిర్వహణ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జగన్ సర్కార్ రాష్ట్రంలో పాఠశాలలు, ఇంటర్ కాలేజీలకు 2021 సంవత్సరం ఏప్రిల్ నెల 30వ తేదీ వరకు డిగ్రీ మరియు పిజీ విద్యార్థులకు 2021 సంవత్సరం ఆగష్టు నెల వరకు క్లాసులు కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది. సిలబస్ లో ముఖ్యమైన అంశాలను విద్యార్థులు మిస్ కాకుండా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది.

విద్యార్థులు మూడు విభాగాలుగా విభజించి చాలా అంశాలను విద్యార్థులు ఇంటి దగ్గరి నుంచే నేర్చుకునే విధంగా ప్రణాళికలను రూపొందించింది. ఈరోజు 9,10వ తరగతి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ నెలంతా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పాఠశాలలు ఉంటాయి. విద్యార్థులను మధ్యాహ్న భోజనం ముగిసిన తర్వాత ఇంటికి పంపిస్తారు; తరగతి గదిలో ఒక విద్యార్థికి మరో విద్యార్థికి మాధ్య 6 అడుగుల కనీస దూరం ఉండేలా చర్యలు చేపట్టారు.

తరగతి గదికి కేవలం 16 మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తారు. రోజు విడిచి రోజు తరగతుల నిర్వహణ జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న స్కూళ్లలో షెడ్యూల్ ను రూపొందించి ఆ షెడ్యూల్ ప్రకారం బోధన జరిగే విధంగా చర్యలు చేపడతారు. నవంబర్‌ 16 నుంచి ఇంటర్ ఫస్టియర్ క్లాసులు, డిసెంబర్ 1 నుంచి డిగ్రీ, పీజీ ప్రొఫెషనల్, నాన్‌ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన క్లాసులు ప్రారంభమవుతాయి.

గ్రామ, వార్డ్ సచివాలయ అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాలు ఎప్పుడంటే..?

ఏపీలో గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నెల రోజుల క్రితం పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. 16,208 ఉద్యోగాల కోసం ఏపీ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వెలువడగా పరీక్షలు జరిగాయి. పది లక్షలకు పైగా అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయగా 7 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరున పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

అధికారులు ఇప్పటికే ఆన్సర్ షీట్ల స్కానింగ్ అభ్యర్థుల వారీగా మార్కుల ప్రక్రియను పూర్తి చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో ఔస్ట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులకు గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలలో 15 శాతం వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మొదట ఔట్ సోర్సింగ్ లో పని చేస్తున్నట్టు కొందరు పేర్కొనకపోవడంతో వాళ్ల వివరాలను సేకరించడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.

మరోవైపు ఈసారి గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలకు ఫలితాలతో పాటు ర్యాంకులను కూడా ప్రకటించనున్నారు. మొత్తం 14 రకాల రాత పరీక్షలు జరగగా ప్రతి ఒక్కరికీ ర్యాంకులను ప్రకటించునున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లతో కూడిన ర్యాంకులను అధికారులు ప్రకటించనున్నారు. గత నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు గ్రామ, వార్డ్ సచివాలయాల రాత పరీక్షలు జరిగాయి.

19 కేటగిరీలలోని ఉద్యోగాల కోసం ఏడు రోజుల పాటు పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలు ఉండగా ఆ ఉద్యోగాలలో 1,10,520 పోస్టులు ఇప్పటికే భర్తీ కాగా 16,208 ఉద్యోగాలను ప్రభుత్వం భరీ చేయనుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సీఎం జగన్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. దసరా పండుగ సమయంలో ఉద్యోగులకు తీపికబురు అందించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభించిన సమయంలో లాక్ డౌన్ అమలు వల్ల ఏపీ ప్రభుత్వానికి ఆదాయం తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది. కొన్ని రోజుల క్రితమే లాక్ డౌన్ సమయంలో కోత విధించిన జీతాలను తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది.

ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి నిన్న సీఎం జగన్ ను కలిసి తమ సమస్యలను చెప్పుకోగా అడిఫర్ జీతాలు, పెన్షన్లు, రెండు డీఏలు వచ్చే నెలలో ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని సమాచారం. చంద్రశేఖర్ రెడ్డి జగన్ కరోనా సోకిన ఉద్యోగులకు నెల రోజుల పాటు స్పెషల్ లీవ్ ఇవ్వాలని.. ఉద్యోగులకు రిటైర్ అయ్యేలోపు ఇంటి స్థలం ఇవ్వాలని.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

ఈ నిర్ణయాల పట్ల జగన్ సానుకూలంగా స్పందించారని సమాచారం అందుతోంది. పీఆర్సీ, సీపీఎస్ అమలు విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని సమాచారం. సంఘం ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మహిళా ఉద్యోగులకు 5 రోజుల సెలవులు ఇవ్వాలని, నాలుగో తరగతి ఉద్యోగుల వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని.. ఉద్యోగులకు సౌకర్యాలు, రాయితీలు పెంచాలని కోరామని తెలిపారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. సీఎం ఎన్జీవో సంఘం అధ్యక్షుడి వినతులకు అనుకూలంగా స్పందించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ సంచలనం.. ఒకటో తరగతి నుంచే సెమిస్టర్ విధానం?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కొన్ని రోజుల క్రితం ఆమోదం తెలిపిన జాతీయ విద్యా విధానం 2020కు అనుగుణంగా సిలబస్ ను మార్చివేసేలా ఆదేశాలు జారీ చేశారు. సిలబస్ మార్పుల గురించి రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. రాష్ట్రానికి చెందిన బృందం ఇప్పటికే ఇతర రాష్ట్రాలతో పాటు, ఇతర దేశాలకు సంబంధించిన ప్రాథమిక విద్యా విధానాలను పరిశీలించింది.

పలు రాష్ట్రాలలో అమలులో ఉన్న ఎన్సీఈఆర్టీ సిలబస్ ను కూడా పరిశీలించి విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా కొత్త సిలబస్ ను తయారు చేసే పనిలో పడింది. రాష్ట్ర విద్యా శాఖ కమీషనర్‌ చినవీరభద్రుడు సీఎం జగన్ సూచనల ఆధారంగా రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ కొత్త సిలబస్ ను రూపొందిస్తోందని వెల్లడించారు. జగన్ సర్కార్ ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు సిలబస్ లో మార్పులు చేయనుందని సమాచారం.

కొత్త విద్యా విధానం ద్వారా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలని.. విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా సిలబస్ ఉండాలని జగన్ సర్కార్ భావిస్తోంది. అధికారులు నూతన సిలబస్ కు అనుగుణంగా ఇప్పటికే పాఠ్య పుస్తకాలను, వర్క్ బుక్ లను రూపొందించారని సమాచారం. జగన్ సర్కార్ రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి సెమిస్టర్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మూడు సెమిస్టర్ లకు అనుగుణంగా అధికారులు పాఠ్యపుస్తకాలను రూపొందించినట్లు సమాచారం. ప్రభుత్వం విద్యార్థులను ఆకర్షించే విధంగా వేర్వేరు రంగులతో కూడిన బొమ్మలతో పుస్తకాలను రూపొందించిందని తెలుస్తోంది. ప్రభుత్వం స్పెషల్ టీంలను నియమించి బుక్స్ ప్రింటింగ్ సకాలంలో జరిగే విధంగా చర్యలు చేపడుతోంది. వచ్చే సంవత్సరం జూన్ నెల నుంచి రాష్ట్రంలో కొత్త విధానం ద్వారా బోధన జరగనుందని తెలుస్తోంది.

వ్యాపారులకు అదిరిపోయే తీపికబురు చెప్పిన జగన్ సర్కార్..?

ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 16 నెలలైంది. ఈ 16 నెలల పదవీ కాలంలో ప్రజా సంక్షేమ నిర్ణయాలకే జగన్ పెద్దపీట వేస్తూ వచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని అందరికీ ప్రయోజనం కలిగే విధంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ రాష్ట్రంలోని వ్యాపారులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలోని వ్యాపారులంతా నష్టాలపాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్లలో దుకాణాలను అద్దెకు తీసుకునే వ్యాపారులు ఎక్కువగా నష్టాలపాలయ్యారు. దీంతో వారికి ప్రయోజనం కలిగేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారం జరగని కాలంలో అద్దె భారాన్ని తొలగించి వ్యాపారులకు ఉపశమనం కలిగించారు. బస్సులు తిరగకపోవడంతో బస్ స్టేషన్లు నెలల పాటు ఖాళీగా దర్శనమిచ్చాయి.

వ్యాపారం సరిగ్గా జరగకపోవడంతో బస్సులు తిరగని సమయాల్లో అద్దెలు రద్దు చేయాలని షాపుల నిర్వాహకులు ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరగా యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎంటీ కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్, మే, జూన్ నెల అద్దెలను ప్రభుత్వం మాఫీ చేసినట్టు వెల్లడించారు. మూడు నెలల అద్దెను మాఫీ చేయడంపై షాపుల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీకి బస్సులతో పాటు దుకాణాల ద్వారా బాగానే ఆదాయం చేకూరుతుంది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే అయితే దుకాణాల యజమానులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ వ్యాపారులకు మేలు చేకూరేలా చేశారు. త్వరలో ఆర్టీసీ బస్ స్టాండ్లలోని ఖాళీ షాపులకు ప్రభుత్వం టెండర్లు పిలవబోతుందని తెలుస్తోంది.