Featured

ఏపీ నిరుద్యోగులకు మరో శుభవార్త.. భారీ నోటిఫికేషన్ విడుదల…?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ గత కొన్ని నెలల నుంచి నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జగన్ సర్కార్ గ్రామ, వార్డ్ సచివాలయాల ఉద్యోగాలు మరియు గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాల ద్వారా నిరుద్యోగులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూర్చింది. తాజాగా జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో అటవీ శాఖలో పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ జరగనుంది.

రాష్ట్ర అటవీ శాఖ అధికారి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. త్వరలో అటవీ శాఖ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుందని కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 40 శాతం సిబ్బంది కొరత ఉండగా ఈ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు అటవీ శాఖ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 23 శాతం అడవులు ఉండగా అడవుల విస్తీర్ణం మరింత పెంచే దిశగా అటవీశాఖ అడుగులు వేస్తోంది.

జాతీయ అటవీ విధానం ప్రకాతం అటవీ అడవుల విస్తీర్ణం పెంచేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీ జరగాల్సి ఉండగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల అంతకంతకూ ఆలస్యమవుతూ వస్తోంది. అటవీశాఖ ప్రస్తుతం 540 ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఉద్యోగాల భర్తీ అనంతరం మరో 1,000 ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఏపీపీఎస్సీ 1000 ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేయనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. కరోనా వైరస్ విజృంభణ తగ్గిన నేపథ్యంలో వరుసగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతూ ఉండటం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago