Tag Archives: ap government

ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. 39 వేల మందికి ఉపాధి అవకాశాలు..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విదితమే. తాజాగా జగన్ సర్కార్ రాష్ట్రంలోని మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న పెట్టుబడుల ప్రోత్సాహక సహాయక మండలి సమావేశానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఏటీసీ టైర్లు, అదానీ డేటా సెంటర్, ఇంటెలిజెంట్ సెజ్ ప్రతిపాదనలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అధికారులు సీఎంకు పరిశ్రమలు ప్రభుత్వం నుంచి కోరుతున్న సహాయసహకారాలు, పరిశ్రమలు కోరుతున్న రాయితీలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించారు. సీఎం జగన్ పరిపాలనా రాజధాని విశాఖలో కాలుష్య రహిత పరిశ్రమలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ మూడు పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో 39 వేల మంది ఉద్యోగులకు ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

రాష్ట్రానికి ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా 16,314 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని సమాచారం. శ్రీకాళహస్తిలో ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ ఏర్పాటు ద్వారా 10,000 మందికి ఇదే సంస్థలో కడపలో మరో సెజ్ ఏర్పాటు ద్వారా 2,000 మందికి ఉపాధి కల్పించనుందని తెలుస్తోంది. ఏటీసీ టైర్ల తయారీ సంస్థ ద్వారా 2,000 మంది ఉపాధి పొందనున్నారని తెలుస్తోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ద్వారా 24,990 మందికి ఉపాధి లభించనుందని తెలుస్తోంది.

రాష్ట్రంలో మరో మూడు పరిశ్రమలు కూడా ఏర్పాటు కానున్నాయని తెలుస్తోంది. విశాఖలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని.. ఆ యూనివర్సిటీ ద్వారా 2,000 మందికి ప్రతి సంవత్సరం శిక్షణ ఇవ్వాలని జగన్ అధికారులు సూచించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున నిరుద్యోగులకు ఉపాధి కల్పన దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోందని తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఆన్ లైన్ అడ్మిషన్లపై స్టే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. ఇంటర్ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం ఇంటర్ కు ఆన్ లైన్ లో అడ్మిషన్లు చేయాలంటూ ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. విద్యాశాఖ ఆన్ లైన్ లో అడ్మిషన్లను చేపట్టడానికి గల కారణాలను వెల్లడించాలని.. ఏ నిబంధనలను అనుసరించి విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుందో చెప్పాలని హైకోర్టు కోరింది.

ఆన్ లైన్ అడ్మిషన్ల గురించి దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు విద్యార్థులకు ఛాయిస్ లేకుండా కాలేజీలలో ప్రభుత్వమే సీట్లను కేటాయించడాన్ని తప్పుబట్టింది. ఏ కాలేజీలో విద్యార్థులు చేరాలనుకుంటున్నారో ఆ నిర్ణయాన్ని వారికే వదిలేయాలని తెలిపింది. విద్యార్థుల భవిష్యత్ పై ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రభావం పడిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను వినిపించారు.

ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల అడ్మిషన్లు చేపట్టడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ తరపు లాయర్ ఆన్ లైన్ అడ్మిషన్ల వల్ల విద్యార్థి సరైన గ్రూపును ఎంచుకోలేడని.. అడ్మిషన్ల సమయంలో కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థికి ఏ గ్రూప్ ఇష్టమో తెలుసుకోవచ్చని.. ఆన్ లైన్ అడ్మిషన్లకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడానికి మరింత సమయం కావాలని హైకోర్టు లాయర్ వాదించారు.

హైకోర్టు ఆన్ లైన్ అడ్మిషన్లపై స్టే విధించగా కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 10వ తేదీలోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు హైకోర్టులో ఎదురుదెబ్బలు తగలగా తాజాగా ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయానికి ఎదురుదెబ్బ తగలడం గమనార్హం.

ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. 6500 ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ప్రారంభం..?

ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. కొత్త ఉద్యోగాలను కల్పించడంతో పాటు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి గత ప్రభుత్వానికి భిన్నంగా పరిపాలన సాగిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ డిసెంబర్ నెలలో 6,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ప్రకటన అమలు దిశగా అడుగులు పడుతున్నాయి.

రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల నిర్ణయాల అమలు విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ నెలలో 6,500 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవుతుందని సీఎం జగన్ తెలిపారు.

తాజాగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తాజాగా రాష్ట్రంలోని 13 జిల్లాల వారీగా, నగర పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలో ఉన్న ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరిలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన రికూట్ మెంట్ షెఢ్యూల్ విడుదల కావచ్చని తెలుస్తోంది. నిరుద్యోగులు ఇప్పటినుంచే ప్రయత్నిస్తే సులువుగా ఉద్యోగం సాధించవచ్చు.

మరోవైపు ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లడం వల్ల కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏపీపీఎస్సీ ఈ నెల 29వ తేదీన కొత్త షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఏపీ కొత్త జిల్లాలకు డేట్ ఫిక్స్… మొత్తం ఎన్ని జిల్లాలంటే..?

జగన్ సర్కార్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు సమస్యలు వేగంగా పరిష్కారమవుతుందని, అభివృద్ధి జరుగుతుందని జగన్ సర్కార్ భావిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ ఏపీ కొత్త జిల్లాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లాలోని ఆర్ & బీ అథితి గృహం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయని.. జిల్లాల ఏర్పాటు సైతం ఇదే విధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే 25 జిల్లాలతో పాటు అరకును కూడా జిల్లా చేయనున్నామని రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలోనే సీఎం జగన్ అధికారంకి వస్తే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటన చేశారు.

అధికారంలోకి రాగానే కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు పడినా కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా ఆ నిర్ణయం అమలు వాయిదా పడింది. అయితే జగన్ సర్కార్ మాత్రం మళ్లీ కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. లోక్ సభ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే జిల్లాల ఏర్పాటు కోసం కమిటీని ఏర్పాటు చేసింది.

కమిటీ నివేదికను పరిశీలించి నివేదిక ప్రకారమే ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అరకు లోక్ సభ నియోకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండటం అక్కడ గిరిజన జనాభా ఎక్కువగా ఉండటం వల్ల ఈ జిల్లా మాత్రం రెండు జిల్లాలు కావడానికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీ విద్యార్థినులకు శుభవార్త.. ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని విద్యార్థినులకు, నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహాయంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. తాజాగా పాలిటెక్నిక్ విద్యార్థినులకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థినులకు ఉచితంగా శిక్షణతో [పాటు ఉద్యోగం కల్పిస్తామని ప్రకటన చేసింది.

స్కిల్ డెవలప్‌మెంట్ మేనేజింగ్ డెరైక్టర్ అర్జా శ్రీకాంత్ ఒక ప్రకటనలో భాగంగా మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. శిక్షణ అనంతరం విద్యార్థినులకు శ్రీసిటీ లోని ఆల్‌స్టామ్ సంస్థలో ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా లేదా ఎలక్ట్రికల్ డిప్లొమా పూర్తి చేసిన 2019 విద్యార్థినులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంపికయిన విద్యార్థినులకు ఫ్రీ ట్రైనింగ్ తో పాటు ఫ్రీగా హాస్టల్ వసతి కల్పిస్తామని పేర్కొన్నారు.

http://engineering.apssdc.in/siemenplacements/ విద్యార్థినులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని.. ఈ నెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులు మాత్రమే అర్హులని తెలిపారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. జిల్లాల నైపుణ్యాభివృద్ధి సంస్థ దరఖాస్తు చేసుకున్న విద్యార్థినుల దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హతలు ఉన్నవారిని శిక్షణకు ఎంపిక చేస్తారు.

ఎంపికైన విద్యార్థినులు శ్రీ సిటీలో శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత వారికి ఆల్‌స్టామ్ సంస్థ, స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ సర్టిఫికెట్లను అందజేస్తాయి. శిక్షణ సమయంలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థినులకు సంవత్సరానికి 3 లక్షల రూపాయల వేతనంతో ఆల్‌స్టామ్‌ సంస్థ ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.

జగన్ సర్కార్ కు హైకోర్టు మరో షాక్.. ఆ పోస్టులపై సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి హైకోర్టు మొట్టికాయలు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టు జగన్ సర్కార్ కు భారీ షాక్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు న్యాయమూర్తులకు సంబంధించి ఘాటు విమర్శలు చేశారు. అనంతరం కొందరు అధికార పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో న్యాయమూర్తులను కించపరిచే విధంగా పోస్టులు చేశారు.

కొన్ని రోజుల క్రితం ఆ పోస్టుల గురించి విచారణ చేయాలని ఏపీ హైకోర్టు సీఐడీకి సూచించింది. అయితే సీఐడీ విచారణ సరిగ్గా చేయకపోవడంతో హైకోర్టు సీఐడీ విచారణ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో పాటు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై, సీఐడీ విచారణ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికార పార్టీకి వ్యతిరేక పోస్టుల విషయంలో సీఐడీ బాగా పని చేస్తోందని.. న్యాయమూర్తులపై పోస్టుల విచారణలో మాత్రం ఆ విధంగా స్పందించడం లేదని తెలిపింది.

అప్పటి హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినా ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని కోరింది. మొత్తం 19 మంది పేర్లను ఫిర్యాదు చేస్తే వారిలో కేవలం 9 మందిపై మాత్రమే కేసులు నమోదు కావడంలో అర్థమేంటని ప్రశ్నించింది. న్యాయ వ్యవస్థపై దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని హైకోర్టు కీలక సూచనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ సీబీఐకి కేసును అప్పగించడంలో గల అభ్యంతరాలను చెప్పాలని కోరింది.

సీఐడీతో పోల్చి చూస్తే సీబీఐకు సాంకేతిక పరిజ్ఞానం, తగిన వనరులు, విభాగాలు, సిబ్బంది ఎక్కువ మంది ఉంటారని పేర్కొంది. చివరకు కేసును సీబీఐకు అప్పగిస్తున్నామని వెల్లడించింది. జగన్ సర్కార్ ఇప్పటికే పలువురు న్యాయమూర్తుల గురించి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ఫిర్యాదు చేసిన 48 గంటల్లోనే హైకోర్టు అధికార పార్టీకి షాక్ ఇవ్వడం గమనార్హం.

విద్యార్థులకు జగన్ శుభవార్త.. విద్యా కానుక అమలు ఎప్పుడంటే..?

ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి విద్య, వైద్య రంగాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. నాడు నేడు కార్యక్రమం ద్వారా సీఎం జగన్ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందే విధంగా చర్యలు చేపట్టారు.

 

అమ్మఒడి పథకం అమలు ద్వారా పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున అందజేస్తోంది. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా హాస్టల్ లో ఉండే విద్యార్థులకు ప్రభుత్వం 20,000 రూపాయలు చెల్లిస్తోంది. ఈ పథకాలతో పాటు జగన్ సర్కార్ విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో జగనన్న విద్యాదీవెన పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ పథకాన్ని జగన్ సర్కార్ మొదట అనుకున్న ప్రకారం ఈరోజే అమలు చేయాల్సి ఉన్నా అనుకోని కారణాల వల్ల పథకం అమలు వాయిదా పడింది.

సీఎం జగన్ ఈ నెల 8వ తేదీన ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 42.34 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం ఈ పథకం కోసం 650 కోట్ల రూపాయల మేర ఖర్చు చేయనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన కిట్లను అందించనుంది.

ఈ కిట్ లో స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బెల్ట్, జత బూట్లు, జత సాక్సులు, 3 జతల యూనిఫారాలు ఉంటాయి. జగన్ సర్కార్ ఈ పథకం ద్వారా పిల్లలు బడిబాట పట్టేలా చేయాలని.. బడి బయట పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది. జగన్ సర్కార్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంపై ప్రజల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి హర్షం వ్ఫ్యక్తమవుతోంది.