ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విదితమే. తాజాగా జగన్ సర్కార్ రాష్ట్రంలోని మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న పెట్టుబడుల ప్రోత్సాహక సహాయక మండలి సమావేశానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఏటీసీ టైర్లు, అదానీ డేటా సెంటర్, ఇంటెలిజెంట్ సెజ్ ప్రతిపాదనలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అధికారులు సీఎంకు పరిశ్రమలు ప్రభుత్వం నుంచి కోరుతున్న సహాయసహకారాలు, పరిశ్రమలు కోరుతున్న రాయితీలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించారు. సీఎం జగన్ పరిపాలనా రాజధాని విశాఖలో కాలుష్య రహిత పరిశ్రమలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ మూడు పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో 39 వేల మంది ఉద్యోగులకు ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
రాష్ట్రానికి ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా 16,314 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని సమాచారం. శ్రీకాళహస్తిలో ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ ఏర్పాటు ద్వారా 10,000 మందికి ఇదే సంస్థలో కడపలో మరో సెజ్ ఏర్పాటు ద్వారా 2,000 మందికి ఉపాధి కల్పించనుందని తెలుస్తోంది. ఏటీసీ టైర్ల తయారీ సంస్థ ద్వారా 2,000 మంది ఉపాధి పొందనున్నారని తెలుస్తోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ద్వారా 24,990 మందికి ఉపాధి లభించనుందని తెలుస్తోంది.
రాష్ట్రంలో మరో మూడు పరిశ్రమలు కూడా ఏర్పాటు కానున్నాయని తెలుస్తోంది. విశాఖలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని.. ఆ యూనివర్సిటీ ద్వారా 2,000 మందికి ప్రతి సంవత్సరం శిక్షణ ఇవ్వాలని జగన్ అధికారులు సూచించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున నిరుద్యోగులకు ఉపాధి కల్పన దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…