Political News

ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. 39 వేల మందికి ఉపాధి అవకాశాలు..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విదితమే. తాజాగా జగన్ సర్కార్ రాష్ట్రంలోని మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న పెట్టుబడుల ప్రోత్సాహక సహాయక మండలి సమావేశానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఏటీసీ టైర్లు, అదానీ డేటా సెంటర్, ఇంటెలిజెంట్ సెజ్ ప్రతిపాదనలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అధికారులు సీఎంకు పరిశ్రమలు ప్రభుత్వం నుంచి కోరుతున్న సహాయసహకారాలు, పరిశ్రమలు కోరుతున్న రాయితీలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించారు. సీఎం జగన్ పరిపాలనా రాజధాని విశాఖలో కాలుష్య రహిత పరిశ్రమలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ మూడు పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో 39 వేల మంది ఉద్యోగులకు ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

రాష్ట్రానికి ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా 16,314 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని సమాచారం. శ్రీకాళహస్తిలో ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ ఏర్పాటు ద్వారా 10,000 మందికి ఇదే సంస్థలో కడపలో మరో సెజ్ ఏర్పాటు ద్వారా 2,000 మందికి ఉపాధి కల్పించనుందని తెలుస్తోంది. ఏటీసీ టైర్ల తయారీ సంస్థ ద్వారా 2,000 మంది ఉపాధి పొందనున్నారని తెలుస్తోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ద్వారా 24,990 మందికి ఉపాధి లభించనుందని తెలుస్తోంది.

రాష్ట్రంలో మరో మూడు పరిశ్రమలు కూడా ఏర్పాటు కానున్నాయని తెలుస్తోంది. విశాఖలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని.. ఆ యూనివర్సిటీ ద్వారా 2,000 మందికి ప్రతి సంవత్సరం శిక్షణ ఇవ్వాలని జగన్ అధికారులు సూచించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున నిరుద్యోగులకు ఉపాధి కల్పన దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోందని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

21 hours ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

22 hours ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

24 hours ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

24 hours ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago