ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఏకంగా రాష్ట్రంలో 48 డిగ్రీ కాలేజీల అనుమతులను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చేత రద్దు చేయించింది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయనే కారణంతో ఈ కాలేజీలకు ప్రభుత్వం అనుమతులు రద్దు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఉన్నతవిద్యామండలి 246 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు షోకాజ్ నోటీసులను జారీ చేసింది.
ఉన్నత విద్యామండలి నుంచి ఇప్పటికే దీనికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఈ ప్రకటనలో రాష్ట్రంలోని కొన్ని డిగ్రీ కాలేజీలకు యూనివర్సిటీల అఫ్లియేషన్ లేదని.. మరికొన్ని కాలేజీలు విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే విద్యార్థులకు చేర్చుకుంటున్నామని, కొన్ని కాలేజీల్లో 25 శాతం కంటే తక్కువ సంఖ్యలో ఉన్నారని ఈ కాలేజీలకు నోటీసులు జారీ చేశామని పేర్కొంది.
షోకాజ్ నోటీసులు జారీ అయిన కాలేజీల యాజమాన్యాలు విద్యామండలి నియమించిన కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. మరోవైపు కొన్ని డిగ్రీ కాలేజ్ లలో ప్రోగ్రామ్ లను ప్రోగ్రామ్ లను ఉన్నత విద్యామండలి ఉపసంహరించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని నన్నయ యూనివర్శిటీ, నాగార్జున యూనివర్శిటీ, ఆంధ్రా యూనివర్శిటీ, కృష్ణా యూనివర్శిటీ, రాయలసీమ యూనివర్శిటీలోని పలు కాలేజీలకు అనుమతుల రద్దుతో పాటుషోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
వీటితో పాటు విక్రమ సింహపురి యూనివర్శిటీ, బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీ పరిధిలోని పలు కాలేజీలకు సైతం షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…