Tag Archives: AP news

AP News: ఆంటీ వయసు 54 యేళ్లు.. మేకప్ తో కవర్ చేస్తూ 30 ఏళ్ల అంటూ యువకుడిని వివాహమాడింది.. చివరికి ఇలా?

AP News: ప్రస్తుత కాలంలో రోజురోజుకు మోసం చేసే వారి సంఖ్య అధికమవుతుంది. మోసేపోయేవారు ఉన్నన్ని రోజులు మోసం చేస్తూనే ఉంటారు అన్నట్టు రోజురోజుకు మోసాల సంఖ్య అధికమవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు పెద్ద ఎత్తున ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ అబ్బాయిలను మోసం చేస్తున్నారు.

AP News: ఆంటీ వయసు 54 యేళ్లు.. మేకప్ తో కవర్ చేస్తూ 30 ఏళ్ల అంటూ యువకుడిని వివాహమాడింది.. చివరికి ఇలా?

తాజాగా ఇలాంటి ఘటన చిత్తూరు జిల్లాలో ఒకటి బయటపడింది. చిత్తూరు జిల్లాకు చెందిన శరణ్య అనే ఓ మహిళకు 54 సంవత్సరాలు. అయితే ఈమె మేకప్ వేసి వయస్సు బయటకు కనపడకుండా బాగా కవర్ చేశారు.ఇలా మేకప్ తో తనకు 30 సంవత్సరాలేనని చెబుతూ ఈమె 35 ఏళ్ల యువకుడిని వివాహం ఆడింది. ఇక పెళ్లి అయిన తర్వాత తన అసలు నాటకం బయటపెట్టింది.

AP News: ఆంటీ వయసు 54 యేళ్లు.. మేకప్ తో కవర్ చేస్తూ 30 ఏళ్ల అంటూ యువకుడిని వివాహమాడింది.. చివరికి ఇలా?

ఆ యువకుడి పేరుపై ఉన్న ఆస్తిని మొత్తం తన పేరుకు మార్చాలంటూ ప్రతిరోజు ఆ యువకుడిని వేధింపులకు గురి చేసేది. ఈ విధంగా ఆ మహిళ టార్చర్ భరించలేక ఆ యువకుడు ఆస్తి తన పేరుపై మార్చడానికి తన ఆధార్ కార్డు తీసుకున్నారు.అయితే ఆధార్ కార్డులో ఆమె వయసుతో పాటు ఆమె మొదటి భర్తకు సంబంధించిన వివరాలు కూడా ఉండడంతో ఒక్కసారిగా ఆ యువకుడు షాక్ అయ్యాడు.

ఆస్తికోసం మోసానికి పాల్పడిన యువతి…

ఈ విధంగా తనకు ముందుగానే పెళ్లి జరిగిందని అంతేకాకుండా తన వయసు 55 సంవత్సరాలని తెలియడంతో ఒక్కసారిగా ఆ యువకుడు కంగుతున్నాడు. ఈ విధంగా శరణ్య తనని మోసం చేయడంతో ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ఆ యువతకి వివాహం జరిగి ఇద్దరు కూతుర్లు ఉండడమే కాకుండా వారికి కూడా వివాహాలు జరిగాయి.అంతేకాకుండా ఆ యువకుడితో శరణ్యకు ఇది రెండవ వివాహం కాదు మూడవ వివాహం అని తెలియడంతో ఆ యువకుడు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

AP News: ఏపీ ప్రభుత్వానికి షాక్..! విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఎన్టీపీసీ..!

AP News: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక లోటులో ఉన్న ఏపీకి వరసగా షాక్ లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పీఆర్సీ అంశంపై ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది. నిన్న విజయవాడలో ఉద్యోగుల ధర్నా విజయవంతం అయింది.

AP News: ఏపీ ప్రభుత్వానికి షాక్..! విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఎన్టీపీసీ..!

ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఉద్యోగులను ప్రభుత్వం కోరుతోంది.
ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వానికి నేషనల్ పవర్ థర్మర్ కార్పోరేషన్(ఎన్టీపీసీ) షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఎన్టీపీసీ ప్రతిచర్యకు దిగింది.

AP News: ఏపీ ప్రభుత్వానికి షాక్..! విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఎన్టీపీసీ..!

రాష్ట్రానికి సరఫరా చేస్తున్న 2 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాని ఒక్కసారిగా ఆపేసింది. దీంతో తేరుకున్న అధికారులు ఈ లోటును భర్తీ చేయడానికి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్( ఆర్టీపీపీ) ద్వారా విద్యుత్ డిమాండ్ పడిపోకుండా చేయాలని భావించారు.

విద్యుత్ సరఫరా చేయలేక ..

ఆర్టీపీపీలో మరో యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే… ఆర్టీపీపీ వద్ద విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు లేవని సమాధానం రావడంతో ఏపీ ప్రభుత్వానికి పాలుపోని స్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే కృష్ణపట్నం యూనిట్లో సాంకేతిక సమస్య కారణంగా 810 మెగాయూనిట్లు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. అయితే అక్కడ కూడా 5 రోజులకు సరిపడే బొగ్గ నిల్వలు మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయలేక ఏపీ వ్యాప్తంగా కోతలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తిరుపతిలో వింత ఘటన.. ఆశ్చర్యపోతున్న ప్రజలు..!

ఇటీవల తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. దాని ఎఫెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతికి తాకింది. అక్కడ కూడా విపరీతమైన వర్షం కురవడంతో.. తిరుమలపై ఎన్నో కట్టడాలు నేలమట్టం అయ్యాయి. భక్తులు వెళ్లే దారి మొత్తం స్తంభించిపోయింది.

తిరుమల దర్శనానికి వచ్చే భక్తులను కూడా రావొద్దని అధికారులు సూచించారు. అయితే అక్కడి పరిస్థితులు ఇప్పుడు బాగానే ఉన్నాయి. భక్తులు కూడా వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. అయితే శ్రీకృష్ణానగర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. సిమెంట్ రింగులతో నిర్మించిన ఓ వాటర్ ట్యాంక్​.. భూమిలోంచి పైకి వచ్చింది. దీన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

వర్షాల కారణంగా నీరంతా ఒకేదగ్గర చేరడంతో.. తిరుపతి శ్రీ కృష్ణా నగర్‌లో అక్కడి కట్టడాలు, వస్తువుల అన్నీ మునిగిపోయాయి. అక్కడ భూమి లోపల పాతిపెట్టిన ఓ నీటి ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా.. భూమి ఉపరితలం పైకి ఎగసి వచ్చింది. అది దాదాపు 25 సిమెంట్ వరలతో నిర్మించారు. దాదాపు అది 25 అడుగుల విస్తీర్ణంతో ఉంది.

ఇలాంటిది ఒక్కసారిగా బయటపడటం కాస్త ఆసక్తికరంగా మారింది. నీటి తొట్టిలోకి దిగి మహిళ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆమె ఒక్కసారిగి ఉలిక్కిపడిపోయింది. కంగారు పడి కళ్లు మూసుకున్న సందరు మహిళ కళ్లు తెరిచి చూసే సరికి భూమి ఉపరితలంలో ఉంది. ప్రస్తుతం ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది.

ఇంటి ముందు ఆగిన ఇద్దరు అమ్మాయిలు.. చివరకు ఏం చేశారో తెలుసా..?

అలంకరణ సామగ్రి అంటే అమ్మాయిలకు ఎంతో ఇష్టం. అంతేకాకుండా అందులోనూ నగలు, పూలు, మేకప్ కిట్లు, డ్రెస్సులు అనేవి ఇంకా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వాటి కోసం వేలల్లో ఖర్చు అయినా వెనకాడకుండా కొనేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ ఇద్దరు అమ్మాయిలు దొంగలుగా మారారు. వాళ్లు చేసే దొంగతనం ఎంటో తెలిస్తే షాక్ అవుతారు.. వాళ్లు పూలకుండీలను దొంగతనం చేస్తున్నారు.
అవునండి.. మీరు విన్నది నిజమే.. వాళ్లు ఇంటి ముందు ఉంచే పూలకుండీలను మాత్రమే దొంగతనం చేస్తున్నారు. ఇది సీసీఫుటేజీలో చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని నగరి ప్యాలెస్ కాపౌండ్ లోని ఓ లాయర్ తన ఇంటి ఎదుట సీసీ ఫుటేజి చెక్ చేయగా ఇదంతా తెలిసింది. ఓ స్కూటీపై ఇద్దరు యువతులు వచ్చి ఇంటిముందు ఆగారు. రోడ్డుపై అటు నుంచి ఇటు నుంచి ఎవరైనా వస్తున్నారా.. అని చూశారు.

ఉన్నట్లుండి పూలకుండీని స్కూటీపై పెట్టుకున్నారు. ఓ నిమిషం తర్వాత ఆ పూలకుండీని తీసేసి.. అక్కడ పెట్టి మరో పూలకుండీని స్కూటీపై పెట్టుకొని అక్కడి నుంచి జారుకున్నారు. మొదట వారు తీసిన పూల కుండీ తులసి మొక్కది కాగా.. దానిని మళ్లీ అక్కడ పెట్టేసి కొత్తరకం పూలమొక్కను దొంగిలించినట్లు ఇంటి యజమాని తెలిపారు. మొక్కలు కావాలంటే నర్సరీలో చాలా ఉంటాయి.. అక్కడకు వెళ్లి కొనుక్కోవాలి లేదా.. ఇంటి దగ్గర ఉంటే దాని అంటును కత్తిరించి తెచ్చి నాటుకోవాలి.

కానీ ఇలా దొంగతనం చేయడం ఏంట్రా అని తెలిసిన వారు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పూలకుండీ మొక్కలకు కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల మనం ఒక మామిడి చెట్టుకు నలుగురు సెక్యూరిటీ గార్డులను కాపలాగా నియమించినట్లు చూశాం. ఇది మధ్యప్రదేశ్ లో జరిగింది. అలాగే.. పూలకుండీలకు కూడా గార్డులు నియమించాలా అంటూ పలువురు పేర్కొంటున్నారు.

ఏపీలో నయా స్మగ్లింగ్ కు తెరలేపిన దొంగలు.. ఇంతకు ఏం చేస్తున్నారంటే?

కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు.. డబ్బుల కోసం ఎవరైనా ఎంతటి పని చేయడానికైనా సిద్దంగా ఉంటారు. అది వారి కుటుంబపోషణ కొరకు మంచిదే. అయితే ఏ పని చేసినా అందరూ ఆమోదయోగ్యంగా ఉండాలి. చట్టానికి వ్యతిరేకంగా పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తే మాత్రం అది ముమ్మాటికి తప్పే. అలాంటిదే కొంత మంది డబ్బులకు ఆశ పడి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నారు.

చట్ట విరోధ పనులు చేసి బ్లాక్ మార్కెట్ దందా కొనసాగిస్తున్నారు. ఇంతకు ఈ నయా దొంగలు ప్రకృతికి విరుద్దంగా చేస్తున్న పని ఏంటంటే.. రైతన్న పొలంలో వానపాములు ఉంటే సాగు బంగారు లాంటి దిగుబడి వస్తుంది అంటారు. అలాంటి వానపాములను ముఠాగా ఏర్పడి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు వీళ్లు. ఆధ్రప్రదేశ్ లో ముఖ్యంగా పులికాట్ సరస్సు అనేది తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు కూడా ఆనుకొని ఉంటుంది. పులికాట్ సరస్సు ఉప్పునీటి సరస్సు అయినప్పటికీ చేపలు, వివిధ రకాల పక్షులకు ఆవాసం ఉండటమే కాకుండా ఇక్కడ వానపాములు సైతం అధికంగా ఉంటాయి.

పులికాట్ సరస్సులో తవ్వేకొద్దీ వానపాములు బయటకు వస్తుంటాయి. ఇదే అదునుగా భావించారు కొందరు దుండగులు. నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఆక్వా కల్చర్ అనేది ఉంటుంది. అందులో రొయ్యలను పెంచుతుంటారు. వాటి ఉత్పత్తి అధికంగా ఉండాలంటే వానపాములను వాటికి ఆహారంగా ఉపయోగిస్తారు. వాటిని కొనుగోలు చేయాలంటే కిలో వానపాములు దాదాపు రూ.3500 నుంచి రూ.4000 వరకు ఉంటుంది. ఇలా కాకుండా పులికాట్ సరస్సుకు దగ్గర్లో నివసిస్తున్న పేదలకు డబ్బు ఆశచూపి కిలో వానపాములకు రూ.1500 ఇస్తామంటూ వారిని మభ్య పెడుతూ వానపాముల సేకరణే వారి పనిగా చూపించారు.

దీంతో ప్రతీ రోజు తవ్వకాలను జరుపుతూ ఇలా పర్యావరణానికి హానీ చేకూరుస్తున్నారు. ఇలాంటివి జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారుల అండతోనే ఇలాంటివి జరుగుతున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై సూళూరుపేట ఇంచార్జ్ డీఎఫ్ఓ పవన్ కుమార్ మాట్లాడుతూ.. స్మగ్లింగ్ కు ప్రోత్సహిస్తున్న వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని.. ఎంతటి వారినైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

వీడియో వైరల్: కుక్క కాంస్య విగ్రహానికి.. పిండ ప్రధానం..!

సాధారణంగా మనం మన ఇళ్ళల్లో పెంపుడు కుక్కలని పెంచుకోవడం సహజమే. ఈ క్రమంలో ఎప్పుడు కుక్కలను ఇంటి సభ్యులుగా భావించి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ క్రమంలోనే వాటికి ఏదైనా ప్రమాదం తలెత్తితే ఎంతో విలవిలలాడి పోతారు.ఈ క్రమంలోనే కొన్ని కారణాల చేత ఆ కుక్కలు మరణిస్తే వాటికి అంత్యక్రియలను కూడా జరిపించడం ఇది వరకు చూసి ఉంటాము.కానీ కుక్క చనిపోతే విగ్రహం చేయించి దానికి పిండప్రదానం చేయడం ఎప్పుడైనా విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన సుంకర జ్ఞాన ప్రకాష్ అనే వ్యక్తి ఒక కుక్కని పెంచుకున్నాడు. దానికి శునకరాజు అనే పేరు పెట్టాడు. ప్రకాష్ కు తన కుక్క శునకరాజు అంటే ఎంతో ఇష్టం. అది కూడా ఇతను చెప్పే పనులన్నింటినీ అర్థం చేసుకుని ఎంతో చక్కగా చేసేది.అయితే అనారోగ్యం కారణంగా కుక్క మృతి చెందడంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయారు.

చనిపోయిన తన పెంపుడు కుక్క శునక రాజుకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అంతటితో ఆగిపోకుండా తన పెంపుడు కుక్కను మరిచిపోలేక.. జ్ఞాన ప్రకాష్ ఏకంగా కాంస్య కుక్క విగ్రహాన్ని తయారు చేయించి , దానిని ప్రతిష్టించి,పిండ ప్రదానం చేశాడు.

ఊరంతా ఫ్లెక్సీలు వేయించి, పురోహితులను పిలిపించి కుక్కకు పిండ ప్రధానం చేసి అందరికీ భోజనాలు పెట్టించారు. ఈ విధంగా శునకరాజు పై జ్ఞాన ప్రకాష్ కు ఉన్న ప్రేమను చూసి కొందరు ఇదేం విడ్డూరం అంటూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.