కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు.. డబ్బుల కోసం ఎవరైనా ఎంతటి పని చేయడానికైనా సిద్దంగా ఉంటారు. అది వారి కుటుంబపోషణ కొరకు మంచిదే. అయితే ఏ పని చేసినా అందరూ ఆమోదయోగ్యంగా ఉండాలి. చట్టానికి వ్యతిరేకంగా పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తే మాత్రం అది ముమ్మాటికి తప్పే. అలాంటిదే కొంత మంది డబ్బులకు ఆశ పడి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నారు.
చట్ట విరోధ పనులు చేసి బ్లాక్ మార్కెట్ దందా కొనసాగిస్తున్నారు. ఇంతకు ఈ నయా దొంగలు ప్రకృతికి విరుద్దంగా చేస్తున్న పని ఏంటంటే.. రైతన్న పొలంలో వానపాములు ఉంటే సాగు బంగారు లాంటి దిగుబడి వస్తుంది అంటారు. అలాంటి వానపాములను ముఠాగా ఏర్పడి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు వీళ్లు. ఆధ్రప్రదేశ్ లో ముఖ్యంగా పులికాట్ సరస్సు అనేది తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు కూడా ఆనుకొని ఉంటుంది. పులికాట్ సరస్సు ఉప్పునీటి సరస్సు అయినప్పటికీ చేపలు, వివిధ రకాల పక్షులకు ఆవాసం ఉండటమే కాకుండా ఇక్కడ వానపాములు సైతం అధికంగా ఉంటాయి.
పులికాట్ సరస్సులో తవ్వేకొద్దీ వానపాములు బయటకు వస్తుంటాయి. ఇదే అదునుగా భావించారు కొందరు దుండగులు. నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఆక్వా కల్చర్ అనేది ఉంటుంది. అందులో రొయ్యలను పెంచుతుంటారు. వాటి ఉత్పత్తి అధికంగా ఉండాలంటే వానపాములను వాటికి ఆహారంగా ఉపయోగిస్తారు. వాటిని కొనుగోలు చేయాలంటే కిలో వానపాములు దాదాపు రూ.3500 నుంచి రూ.4000 వరకు ఉంటుంది. ఇలా కాకుండా పులికాట్ సరస్సుకు దగ్గర్లో నివసిస్తున్న పేదలకు డబ్బు ఆశచూపి కిలో వానపాములకు రూ.1500 ఇస్తామంటూ వారిని మభ్య పెడుతూ వానపాముల సేకరణే వారి పనిగా చూపించారు.
దీంతో ప్రతీ రోజు తవ్వకాలను జరుపుతూ ఇలా పర్యావరణానికి హానీ చేకూరుస్తున్నారు. ఇలాంటివి జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారుల అండతోనే ఇలాంటివి జరుగుతున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై సూళూరుపేట ఇంచార్జ్ డీఎఫ్ఓ పవన్ కుమార్ మాట్లాడుతూ.. స్మగ్లింగ్ కు ప్రోత్సహిస్తున్న వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని.. ఎంతటి వారినైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…