Tag Archives: apologizes

Upasana Konidela: కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా దంపతులకు క్షమాపణలు చెప్పిన ఉపాసన!

Upasana Konidela: బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న
కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉంటూ చివరికి పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక ఈ దంపతులు మంగళవారం సాయంత్రం వివాహ బంధంతో ఒకటయ్యారు.

ఈ క్రమంలోనే నటి కియారా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేము శాశ్వత బంధంలోకి వెళ్ళామని మాకు మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ తన పెళ్లి ఫోటోలను షేర్ చేసారు. ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇకపోతే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు రామ్ చరణ్ దంపతులను తన పెళ్లికి ఆహ్వానించారు. అయితే కొన్ని కారణాలవల్ల రామ్ చరణ్ దంపతులు కియారా పెళ్లికి హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లి ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కొత్త జంటకు క్షమాపణలు చెప్పారు.

Upasana Konidela: పెళ్లికి రాలేకపోయాను…

ఈ సందర్భంగా వీరికి పెళ్లి ఫోటోలను ఉపాసన షేర్ చేస్తూ ఎంతో చూడముచ్చటగా ఉన్నారు.. మీకు పెళ్లి శుభాకాంక్షలు అని శుభాకాంక్షలు తెలియజేస్తూ .. పెళ్లికి రాలేకపోయినందుకు క్షమాపణలు కూడా తెలిపారు. ఇలా ఉపాసన కీయారా దంపతులకు క్షమాపణలు తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్టు వైరల్ గా మారింది.

Sai Pallavi: సాయి పల్లవికి తెలంగాణ హైకోర్టు షాక్.. క్షమాపణ చెబితే కేసు వాపస్?

Sai Pallavi: నాచురల్ బ్యూటీ సాయి పల్లవి సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె కాశ్మీర్ పండిట్ల గురించి, గో సంరక్షకులు గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సాయి పల్లవి చేసిన మాటలలో ఏ విధమైనటువంటి తప్పులేదు.

Sai Pallavi: సాయి పల్లవికి తెలంగాణ హైకోర్టులో.. క్షమాపణ చెబితే కేసు వాపస్?

మనం మంచిగా ఉండాలి కానీ మతాలలో కాదు. మనలో మంచితనం లేకుంటే మతంలో ఎక్కడ వస్తుంది అంటూ వెల్లడించారు. ఈ విధంగా సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు ఏ విధమైనటువంటి తప్పులేదు కానీ కొందరు ఈమె స్టార్ డమ్ అడ్డుపెట్టుకొని పెద్ద ఎత్తున రచ్చ చేశారు. అలాగే సాయి పల్లవి వ్యాఖ్యలపై భజరంగ్ దళ్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేశారు.

Sai Pallavi: సాయి పల్లవికి తెలంగాణ హైకోర్టులో.. క్షమాపణ చెబితే కేసు వాపస్?

అయితే సాయి పల్లవి ఈ ఫిర్యాదులను రద్దు చేసి ఏకంగా హైకోర్టు ఆశ్రయించారు. అయితే హైకోర్టులో సాయి పల్లవికి చేదు అనుభవం ఎదురయింది. హైకోర్టు సాయి పల్లవి అభ్యర్థనను తోసి పుచ్చింది.అయితే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాను చేస్తున్న ఈ వ్యాఖ్యలకు సినిమా విడుదలైన తర్వాత స్పందిస్తానని చెప్పిన సాయి పల్లవి జూన్ 21వ తేదీ హైకోర్టును ఆశ్రయించింది.

క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసిన భజరంగ్ దళ్ నాయకులు…

తెలంగాణ హైకోర్టు సాయి పల్లవి అభ్యర్థనను స్వీకరించకపోవడంతో ఈమెకు నిరాశ ఎదురైనట్టయింది. ఈ క్రమంలోనే భజరంగ్ దళ్ నాయకులు సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలను వెనుక తీసుకుని క్షమాపణలు చెబితే తాము కూడా కేసు వెనక్కి తీసుకుంటామంటూ వెల్లడించారు. మరి ఈ విషయంపై సాయి పల్లవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

వారికి క్షమాపణలు చెప్పిన జక్కన్న.. కారణం ఎంటంటే..?

ఇప్పుడు టాలీవుడ్ లో అందరి చూపు ఆర్ఆర్ఆర్ మూవీపైనే ఉంది. ఎప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా.. సెన్సెషనల్ మల్టీస్టార్ సినిమాను ఎప్పుడు చూద్దామా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను జనవరి 7 న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇక దీనిని రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

పీరియాడిక్ మల్టీ-స్టారర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి కూడా విధితమే. ఇక దీనికి ప్రమోషన్ పనులను వేగవంతం చేసేశారు . తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతో సహ అనేక బాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతుండగా.. అన్నీ భాషల్లో ప్రమోషన్ పనులను చేపట్టారు. దీనికి రాజమౌళినే దగ్గర ఉండి.. ఈ ప్రమోషన్స్ చేయిస్తున్నాడు. దీని నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. దోస్తీ, నాటు నాటు మరియు జనని.

ఈ మూడు పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఇటీవల రాజమౌళి కర్ణాటకలో యశవంతపురంలోని ఓరియన్ మాల్ లో సినిమా ప్రమోషన్ లో భాగంగా జనని కన్నడ పాటను ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశారు. అక్కడ అతడు కన్నడలోనే మాట్లాడారు. తర్వాత ఇదే పాటను తమిళంలో లాంచ్ చేస్తున్న సమయంలో సినీ సోదరులకు సారీ చెప్పారు రాజమౌళి.

గత మూడు సంవత్సరాల నుంచి తమతో ఇంటరాక్ట్ కానందుకు తమిళ సినీ మీడియా సోదరులకు మొదట క్షమాపణలు చెప్పారు. జనవరిలో సినిమా విడుదలకు ముందు జరిగే గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో తప్పకుండా తమిళ మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తానని, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడతానని రాజమౌళి తమిళ మీడియాకి తెలిపారు.

‘ఆమాట కావాలని అనలేదు..’ సన్నీ, కాజల్ కు క్షమాపణలు చెప్పిన కమెడియన్ సుదర్శన్..

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం సండే ఎంతో ఫన్ డే గా జరుగుతుంది. ఈ క్రమంలోని నాగార్జున బిగ్ బాస్ వేదిక పైకి వచ్చి హౌస్ సభ్యులతో ముచ్చటిస్తారు. ఈ ఆదివారం బిగ్ బాస్ వేదికపైకి అనుభవించు రాజా టీమ్ వచ్చి సందడి చేశారు. రాజ్ తరుణ్, కౌశిక్, నెల్లూరు సుదర్శన్ కాసేపు బిగ్ బాస్ వేదికపై హౌ సభ్యులతో మాట్లాడుతూ సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా కమెడియన్ సుదర్శన్ మాట్లాడుతూ సన్నీ కాజల్ రిలేషన్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు. కాజల్ అలిగినప్పుడు సన్నీ వచ్చి ఓదార్చడం ఎంతో రొమాంటిక్ గా ఉంటుందని అన్నారు. అయితే ఈ విషయం విన్న సన్నీ వారి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉందని చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ విధంగా నెల్లూరు సుదర్శన్ సన్నీ, కాజల్ రిలేషన్ గురించి ఇలా మాట్లాడటంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున సుదర్శన్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ కోసం వచ్చి ఇలా తప్పుడు మాటలు మాట్లాడతారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై సుదర్శన్ స్పందించారు.

నేను కావాలని అలా అనలేదని పొరపాటు జరిగిందని ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సన్నీ, కాజల్ ఆమె కుటుంబాన్ని క్షమాపణ కోరుతున్నానని ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.