Sai Pallavi: సాయి పల్లవికి తెలంగాణ హైకోర్టులో.. క్షమాపణ చెబితే కేసు వాపస్?
Sai Pallavi: నాచురల్ బ్యూటీ సాయి పల్లవి సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె కాశ్మీర్ పండిట్ల గురించి, గో సంరక్షకులు గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సాయి పల్లవి చేసిన మాటలలో ఏ విధమైనటువంటి తప్పులేదు.
మనం మంచిగా ఉండాలి కానీ మతాలలో కాదు. మనలో మంచితనం లేకుంటే మతంలో ఎక్కడ వస్తుంది అంటూ వెల్లడించారు. ఈ విధంగా సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు ఏ విధమైనటువంటి తప్పులేదు కానీ కొందరు ఈమె స్టార్ డమ్ అడ్డుపెట్టుకొని పెద్ద ఎత్తున రచ్చ చేశారు. అలాగే సాయి పల్లవి వ్యాఖ్యలపై భజరంగ్ దళ్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేశారు.
అయితే సాయి పల్లవి ఈ ఫిర్యాదులను రద్దు చేసి ఏకంగా హైకోర్టు ఆశ్రయించారు. అయితే హైకోర్టులో సాయి పల్లవికి చేదు అనుభవం ఎదురయింది. హైకోర్టు సాయి పల్లవి అభ్యర్థనను తోసి పుచ్చింది.అయితే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాను చేస్తున్న ఈ వ్యాఖ్యలకు సినిమా విడుదలైన తర్వాత స్పందిస్తానని చెప్పిన సాయి పల్లవి జూన్ 21వ తేదీ హైకోర్టును ఆశ్రయించింది.
తెలంగాణ హైకోర్టు సాయి పల్లవి అభ్యర్థనను స్వీకరించకపోవడంతో ఈమెకు నిరాశ ఎదురైనట్టయింది. ఈ క్రమంలోనే భజరంగ్ దళ్ నాయకులు సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలను వెనుక తీసుకుని క్షమాపణలు చెబితే తాము కూడా కేసు వెనక్కి తీసుకుంటామంటూ వెల్లడించారు. మరి ఈ విషయంపై సాయి పల్లవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…