Tag Archives: balakrishna

అమ్మో.. బాలయ్య సినిమాకు అన్ని కోట్లు ఖర్చు పెట్టారా..??

నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘అఖండ’.. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా బాలయ్యతో బోయపాటి గతంలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించడంతో, అఖండ కూడా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

ఇక అఖండ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే పేర్కొంది. కాగా ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.ఈ సినిమాను నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు అనుకున్నదానికంటే కూడా ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు రూ.60 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ బడ్జెట్‌లో బాలయ్య రెమ్యునరేషన్ కూడా సాధారణంగా ఉండటం గమనార్హం.ఈ సినిమా కథనం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని చిత్ర నిర్మాత ఇలా భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అఖండ చిత్రానికి అదిరిపోయే విజయాన్ని అందించేందుకు ఈ సినిమాను బడ్జెట్ పరంగా ఏమాత్రం తగ్గకుండా చూస్తున్నారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది..ఇటీవలే వికారాబాద్ అడవుల్లో ఓ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా కరోనా వల్ల వాయిదా పడింది.. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని మే28 ఎన్టీఆర్ జయంతి రోజున విడుదల చేయనున్నారు..ఇక ఈ సినిమా అనంతరం క్రాక్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు బాలయ్య..!!

అదరగొడుతున్న ‘అఖండ’.. బాలయ్య పేరిట సరికొత్త రికార్డ్..!!

నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొత్త సినిమా టీజర్ తో ఓ సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసాడు.. సీనియర్ హీరోల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన రజినీ ‘కబాలి’ టీజర్ 37 మిలియన్ వ్యూస్ రికార్డ్ ను, బాలయ్య ‘అఖండ’ టీజర్ 38 మిలియన్ల వ్యూస్ తో బ్రేక్ చేసింది. మొత్తానికి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ రికార్డ్ ను, బాలయ్య బ్రేక్ చేయడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలయ్య ఖాతాలో ఒక సరికొత్త రికార్డ్ అయితే చేరింది.

ఈ ‘అఖండ’ టీజర్ తో అనూహ్యంగా ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ టీజర్ బాలయ్య అభిమానులతో పాటు యావత్తు ప్రేషకులను సైతం ఆకట్టుకోవడం విశేషం.మొత్తానికి ఈ టీజర్ ఈ రికార్డ్ ను సాధించి బాలయ్యకి ఇంకా స్టార్ డమ్ ఉందని నిరూపించింది. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ డీల్ కూడా ఫినిష్ అయింది.

19 కోట్ల రూపాయలకు స్టార్ మా సంస్థ ‘అఖండ’ శాటిలైట్ రైట్స్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి కూడా భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం డిజిటల్ రైట్స్ డీల్ కోసం పలు సంస్థలు అఖండ నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. డిజిటల్ రైట్స్ కి చిత్రయూనిట్ సుమారు 22 కోట్లు అడుగుతున్నట్లు టాక్.ఎలాగూ బాలయ్య సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో మంచి వ్యూస్ వస్తుంటాయి. అలాగే బోయపాటి సినిమాకి కూడా పల్లెటూరి జనంలో మంచి క్రేజ్ ఉంటుంది..

ఆ వర్గం ప్రేక్షుకులు డిజిటల్ ప్లాట్ ఫామ్ కి కొత్త కస్టమర్స్ అవుతారు. అందుకే ఓటిటీ ప్లాట్ ఫామ్స్ అఖండ కోసం పోటీ పడుతున్నాయి. ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి, ఆ తర్వాత దాన్ని మించిన సినిమా ‘లెజెండ్’ రూపంలో ఇచ్చి బాలయ్య కెరీర్ లోనే చిరస్థాయిగా నిలిచిపోయే విజయాన్ని అందించాడు. ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ అందించాలనే కసితో బోయపాటి ఈ ‘అఖండ’ సినిమాని తీర్చిదిద్దుతున్నారట…!!

వైఎస్సార్ ఒక చరిత్ర… బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..?

టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఏ విషయం గురించైనా మనస్సులో ఉన్నదున్నట్లుగా మాట్లాడతారనే సంగతి తెలిసిందే. తప్పు చేసినా, మంచి చేసినా పార్టీలతో సంబంధం లేకుండా బాలకృష్ణ ప్రశంసిస్తూ ఉంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ కు అభిమాని అని.. వైఎస్సార్ అంటే ఒక చరిత్ర అని తెలిపారు.

తెలుగునాడులో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అభిమానులు కానిది ఎవరని బాలకృష్ణ చెప్పారు. 15 సంవత్సరాల క్రితం వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో లెజెండ్ అనే పదం గురించి చిరంజీవి, మోహన్ బాబు కొట్టుకుంటున్నారని.. ఆ సమయంలో అక్కడికి వైఎస్సార్ రాగా ఆయనకు అక్కడ ఏం జరుగుతుందో కొన్ని క్షణాల పాటు అర్థం కాలేదని.. దీంతో వైఎస్సార్ అక్కడినుంచి వెళ్లిపోదామని పీఏకు చెప్పాడని తెలిపారు.

ఆ తరువాత వైఎస్సార్ పీఏ మనం బాలకృష్ణ గారికి సన్మానం చేసి వెళ్లాలని చెప్పారని.. దీంతో వైఎస్సార్ బాలయ్య గారంటే పెద్దాయన అబ్బాయని ఆయనకు సన్మానం చేసే వెళ్లాలని అన్నారని బాలకృష్ణ అలనాటి జ్ఞాపకాలను చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వైఎస్సార్ తనకు సన్మానం చేశారని.. ఎన్టీఆర్ అభిమానులు వారికి వారుగా చరిత్రను లిఖించుకునన్నారని వెల్లడించారు.

చాలామంది స్టేజీలపై తాము గొప్పంటే తాము గొప్ప అంటూ చెబుతారని.. అలాంటి వాళ్లు గొప్పవాళ్లు కారని.. ఆదిశంకరాచార్యులు, మద్వాచారులు, రామానుజాచారులు, మహాత్మగాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ లాంటి వాళ్లు మాత్రమే గొప్పవాళ్లని వెల్లడించారు.